మనం స్వాతంత్రం తెచ్చుకున్నది అవినీతి పరులను బ్రతికించడానికే అన్నట్లుగా ఉంది.ప్రస్తుతం సమాజ శ్రేయస్సు కంటే వ్యక్తి శ్రేయస్సు ముఖ్యంగా భావించే స్వార్ధపరుల మధ్య కలుపు మొక్కల్లా మారిపోయాయి ప్రజల జీవితాలు.
ప్రాణాలు పోతున్నా సరే శవాల మీద కూడా డబ్బు సంపాదించుకునే ఘనులు లోకంలో తయారు అవుతున్నారు.
ఇక ఈ కరోనా సమయంలో ఎన్ని లక్షల కోట్లు చేతులు మారాయే అందరికి తెలిసిందే.
వైద్యం పేరుతో కార్పోరెట్ దవఖానాలు దండిగా డబ్బులు దండుకున్నాయి.ఇదిలా ఉండగా ముంబయిలో బయట పడిన కరోనా టీకా స్కాంలో దుండగులు బాధితులకు సెలైన్ వాటర్ ఇచ్చినట్లు తెలుస్తుందని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేష్ తోపే తెలిపారు.
కాగా ఈ కుంభకోణంలో బాధితులుగా 2040 మంది ఉన్నారని, ఇక ఈ దురాగతానికి పాల్పడిన నిందితుల్లో 10 మందిని అరెస్టు చేశామని, మిగతావారి ఆచూకి కోసం వెతుకుతున్నామని వెల్లడించారు.