లిమిటెడ్ ఆఫర్: వారికి ట్రావెల్ టికెట్లపై వారి ఆఫర్స్ ప్రకటించిన పేటీఎం..!

ప్రముఖ యూపీఐ పేమెంట్ యాప్ పేటీఎం( Paytm ) యూజర్లకు గుడ్ న్యూస్ తెలిపింది.ట్రావెల్ టికెట్లపై భారీ డిస్కౌంట్లు ప్రకటించింది.

ఫ్రీడమ్ ట్రావెల్ కార్నివార్( Freedom Travel Carnival ) పేరుతో ఈ ట్రావెల్స్ బుకింగ్స్‌పై ఆఫర్లు ప్రకటించింది.ఆగస్టు 1 నుంచి 10వ తేదీ వరకు ఈ ఆఫర్లు అందుబాటులో ఉండనున్నాయి.

విమాన, రైలు, బస్సు ప్రయాణ టిక్కెట్లపై ఈ ఆఫర్లు ప్రకటించింది.స్వాతంత్ర దినోత్సవం( Independence day) సందర్భంగా ఈ ఆఫర్లను పేటీఎం ప్రవేశపెట్టింది.

ఈ ఆఫర్ల ద్వారా ప్రయాణికులు తమ టికెట్లపై డబ్బులు ఆదా చేసుకోవచ్చు.క్రెడిట్ కార్డులు, పేటీఎం వ్యాలెట్, పేటీఎం పోస్ట్ పెయిడ్ ద్వారా టికెట్లపై భారీ డిస్కౌంట్స్ లభిస్తాయి.

Advertisement

ఆర్‌బీఎల్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్( ICICI Bank )కార్డులపై విమానం టికెట్లు బుక్ చేసుకుంటే 15 శాతం, అంతర్జాతీయ విమాన టికెట్లపై 10 శాతం ఇన్ స్టంట్ డిస్కౌంట్ ఇస్తోంది.అలాగే పేటీఎం పోస్ట్ పెయిడ్, వ్యాలెట్ ద్వారా పేమెంట్ చేసి బుకింగ్ చేసుకుంటే 12 శాతం డిస్కౌంట్ వస్తుంది.ఇక విద్యార్థులు, సీనియర్ సిటిజన్లు, సాయుధ దళాల సిబ్బందికి ప్రత్యేక ఆఫర్లు అందిస్తోంది.

వీళ్లు జీరో కన్వీనియన్స్ ఫీజుతో టికెట్లను బుక్ చేసుకోవచ్చు.ఇక బస్ టిక్కెట్లపై 25 శాతం వరకు డిస్కౌంట్ వస్తుంది.

పేటీఎం క్రేజీ సేల్ కోడ్ తో 25 శాతం ఇన్ స్టంట్ డిస్కౌంట్ వస్తుంది.

ఇక బెస్ట్ ప్రైస్ గ్యారెంటీడ్ ప్రొగ్రామ్ కింద 2,500 కన్నా ఎక్కువ బస్ ఆపరేట్లలో అత్యల్ప ధరకు పొందవచ్చు.ఇక ట్రైన్ టికెట్ల బుకింగ్( Train Ticket Bookings ) పై జీరో ఛార్జీలతో టికెట్లను అందిస్తుంది.అలాగే రైళ్లను రియల్ టైమ్ లో ట్రాక్ చేసే సదుపాయంతో పాటు పీఎన్‌ఆర్ స్టేటస్ ఈజీగా తెలుసుకోవచ్చు.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?

అలాగే కస్టమర్ సపోర్ట్ ను కూడా అందిస్తుంది.అలాగే విమాన, బస్సు, ట్రైన్ టికెట్లు బుక్ చేసుకున్న తర్వాత ఉచిత క్యాన్సిలేషన్ పాలనీ కూడా తీసుకొచ్చింది.టికెట్ రద్దు చేసుకుంటే 100 శాతం రీఫండ్ వస్తుంది.

Advertisement

తాజా వార్తలు