వైయస్ షర్మిల కొత్త పార్టీ పై సంచలన వ్యాఖ్యలు చేసిన పవన్ కళ్యాణ్..!!

తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఈ ఏడాది ఫిబ్రవరి మాసం నుండి దివంగత వైఎస్ఆర్ తనయురాలు షర్మిల పేరు మారు మ్రోగుతున్న సంగతి తెలిసిందే.

తెలంగాణ రాష్ట్రంలో రాజన్న రాజ్యం తీసుకు వస్తానని చెప్పి తాజాగా "వైయస్సార్ తెలంగాణ పార్టీ" నీ షర్మిల ప్రకటించడం తెలిసిందే.

ఈ నేపథ్యంలో తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ షర్మిల కొత్త పార్టీ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.సానుకూలంగా స్పందిస్తూ ప్రజలు కోసం పోరాడటానికి మంచి చేయడానికి ఎవరు పార్టీ పెట్టినా మంచి పరిణామమని.

షర్మిల పార్టీ ని స్వాగతిస్తున్నట్లు పవన్ తెలిపారు.కొత్త పార్టీలు రావాలని అదే రీతిలో ప్రజలకు మేలు చేసే విధంగా ఉండాలని తెలిపారు.

అంత మాత్రమే కాక వైయస్ షర్మిల కి పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు కూడా తెలిపారు.ఇంకా ఇదే రీతిలో కుటుంబ వారసత్వ రాజకీయం ఉన్న వాళ్ళు మాత్రమే కాక ఇతరులు కూడా రాజకీయాల్లోకి రావాలని స్పష్టం చేశారు.

Advertisement

తెలంగాణ రాష్ట్రంలో ఉన్న యువతను ప్రోత్సహించడానికి జనసేన పార్టీ ఉందని.పేర్కొన్నారు.

అదే రీతిలో తెలంగాణ గడ్డ ఉద్యమస్ఫూర్తితో ఉన్న నేల అని.రాజకీయంగా కొత్త రక్తం చైతన్యంతో కూడిన యువత.రాజకీయాల్లోకి రావాలని పవన్ పిలుపునిచ్చారు.

Advertisement

తాజా వార్తలు