అక్టోబర్ 2వ తారీఖు గాంధీ జయంతి నాడు శ్రమదానం చేయనున్న పవన్..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి పై.ఇప్పటికే పలుమార్లు జనసేన అధినేత పవన్ ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించడంజరిగింది.

ఈ క్రమంలో అక్టోబర్ రెండో తారీకు గాంధీ జయంతి సందర్భంగా.ఏపీలో రోడ్ల దుస్థితి పై పోరాటం చేయడానికి స్వయంగా పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగుతున్నారు.

ధవలేశ్వరం అదేరీతిలో కొత్తచెరువు ప్రాంతాల్లో రోడ్ల మరమ్మతు కార్యక్రమాన్ని.పవన్ చేపట్టనున్నారు.

తొలుత అక్టోబర్ 2 ఉదయం 10 గంటలకు తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం వద్ద కాటన్ బ్యారేజీ పై  రోడ్డు మరమ్మతులు చేసే కార్యక్రమానికి.పవన్ హాజరుకానున్నారు.

Advertisement

; ఆ తర్వాత అదే రోజు మధ్యాహ్నం రెండు గంటలకు అనంతపురం జిల్లా కొత్తచెరువు పంచాయతీ పరిధిలోని పుట్టపర్తి ధర్మవరం రోడ్డు మరమ్మతులు కార్యక్రమంలో పవన్ పాల్గొననున్నారు.గతంలోనే ఏపీలో రహదారుల విషయంలో పవన్ పలుమార్లు ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరిగింది.

ఈ నేపథ్యంలో పవన్ నేరుగా అక్టోబర్ 2వ తారీఖు రంగంలోకి దిగుతూ ఉండటంతో.పార్టీ నాయకులు.

కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొనటానికి రెడీ అవుతూ ఉన్నారు.దీనికి సంబంధించి పార్టీ నుండి అధికారిక ప్రకటన కూడా వెలువడింది.

శ్రావణమాసం ఎఫెక్ట్ .. టి. కాంగ్రెస్ లో చేరికలు షురూ
Advertisement

తాజా వార్తలు