పవన్ కళ్యాణ్ త్వరలో పోలవరం ప్రాజెక్టును సందర్శించునున్నారు..నాదెండ్ల మనోహర్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ త్వరలో పోలవరం ప్రాజెక్టును సందర్శించునున్నారని ఆ పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు పోలవరం నిర్మాణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నవన్నీ అబద్ధాలేనని ఇటీవల తేలిందన్నారు కేంద్ర ప్రభుత్వానికి సరైన సమాచారం ఇవ్వకుండా అవినీతి అక్రమాలకు పాల్పడుతుందని మనోహర్ తెలిపారు పోలవరం పై వాస్తవ పరిస్థితులను వివరించేందుకు పవన్ కళ్యాణ్ ప్రాజెక్టును సందర్శించి అదే రోజు కొవ్వూరులో బహిరంగ సభ నిర్వహిస్తారని ఆయన తెలిపారు.

పశ్చిమగోదావరి జిల్లా.

భీమవరంలో పర్యటిస్తున్న నాదెండ్ల మనోహర్.ప్రభుత్వ విధానాలపై మండిపడ్డారు ఉదయం సాయిబాబా గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

ప్రభుత్వ వ్యతిరేక ఓటుని ఎట్టి పరిస్థితుల్లో చీలనివ్వమని వైఎస్ఆర్సిపి ప్రభుత్వాన్ని ఇంటికి పంపడమే జనసేన లక్ష్యమని నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు.

చిత్తూరు అభివృద్ధి తెలుగుదేశంతోనే సాధ్యమవుతుంది - బాలకృష్ణ
Advertisement

తాజా వార్తలు