పవన్‌ కోటి విరాళం : అప్పుడు నా వద్ద లేవు, ఇప్పుడు ఉన్నాయి ఇచ్చాను

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ఆర్థికంగా కోట్లకు కోట్లు విరాళాలు ఇవ్వడం మనం చూస్తూనే ఉంటాం.ఆయన ఇచ్చే విరాళాలు చూసి అంతా అవాక్కవుతూ ఉంటారు.

ఆర్థికంగా సరిగా లేదు అంటూనే ఆయన చేస్తున్న సాయాలు.ఆయన చేపడుతున్న కార్యక్రమాలకు ఆయన ఫాలోవర్స్‌ అంతా ముక్కున వేలేసుకుంటారు.

తాజాగా అమరవీరుల కుటుంబాల సంక్షేమ నిధికి తనవంతు సాయం అన్నట్లుగా పవన్‌ కోటి రూపాయలను విరాళం ఇచ్చాడు.

గతంలోనే ఈ సహాయ నిధి కార్యక్రమం మొదలు పెట్టారు.అయితే ఆ సమయంలో తన వద్ద డబ్బులు లేని కారణంగా ఇవ్వలేక పోయాను.ఇప్పుడు నేను సినిమాలు చేస్తున్నాను.

Advertisement

ఆ సినిమాల ద్వారా వచ్చే పారితోషాకాలు ఉన్న కారణంగా ఇప్పుడు నేను విరాళం ఇచ్చాను అన్నాడు.సైనికుల కుటుంబాలకు అండగా ఉండటం ప్రతి ఒక్కరి బాధ్యత అంటూ ఈ సందర్బంగా పవన్‌ చెప్పుకొచ్చాడు.

ప్రస్తుతం పవన్‌ కళ్యాణ్‌ మూడు సినిమాల్లో నటిస్తున్నాడు.మరోటి కూడా చర్చల్లో ఉంది.త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఈ ఏడాది చివర్లో సినిమా ప్రారంభం అవుతుందని అన్నారు.

అయితే ఎన్టీఆర్‌ చిత్రం పూర్తి అయిన తర్వాత పవన్‌ మూవీ ఉంటుందని ఇండస్ట్రీలో టాక్‌ వినిపిస్తుంది.పెద్ద ఎత్తున అంచనాలున్న పవన్‌ మూడు సినిమాలు కూడా ఇదే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.

కాంగ్రెస్ రాజకీయం ముందు బీజేపీ బచ్చా.. : జగ్గారెడ్డి
Advertisement

తాజా వార్తలు