ఆర్జీవీని పరాన్నజీవిని చేసిన పవర్ స్టార్ ఫ్యాన్స్

ఎప్పుడు వివాదాలతో సహవాసం చేస్తూ, ఎవరో ఒక జీవితంలోకి దూరిపోయి వారి కథలని సినిమాల ద్వారా రోడ్డు మీదకి లాగడం, చిల్లర డబ్బులతో సినిమా తీయడం, మార్కెట్ చేసుకొని కోట్లు కూడబెట్టుకోవడం ఇప్పుడు టాలీవుడ్ రామ్ గోపాల్ వర్మ చేస్తున్న పని.

ఒకప్పుడు అతనిని గొప్ప దర్శకుడుగా కీర్తించిన వారు సైతం ఆర్జీవీకి బుర్ర చెడిపోయింది అంటూ విమర్శలు చేస్తున్నారు.

ఇప్పుడు ఆర్జీవీ పవన్ కళ్యాణ్ జీవితం మీద పడ్డాడు.పవర్ స్టార్ టైటిల్ పెట్టి తనకి తోచిందే కథ అన్నట్లు సినిమా తీసి పారేస్తున్నాడు.

అయితే ఆర్జీవీ చేస్తున్న పని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి విపరీతంగా కోపం తెప్పిస్తుంది.మామూలుగానే పవన్ కళ్యాణ్ ని ఎవరైనా ఏమైనా అంటే ఫ్యాన్స్ అస్సలు ఊరుకోరు.

అలాంటిది ఆర్జీవీ సినిమా తీస్తే ఊరుకుంటారా అందుకే ఏకంగా అతన్ని ఒక పరాన్నజీవిగా మార్చేసి సెటైరికల్ సినిమా తీస్తున్నారు.ఆర్జీవీ వ్యక్తిత్వం, ఆలోచనలని టార్గెట్ చేస్తూ పరాన్న జీవి.రెక్‌లెస్ జెనిటిక్ వైరస్ అనేది ట్యాగ్ లైన్ తో సినిమాని తెరకెక్కిస్తున్నారు.99 థియేటర్ బ్యానర్‌పై స్కై మీడియా ప్రైవేట్ లిమిటెడ్ నిర్మాణ సారథ్యంలో ఈ సినిమాని తెరకెక్కుతుండగా, డాక్టర్ నూతన్ నాయుడు ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు.సినిమాకి సంబంధించిన నటీనటులను, సాంకేతిక నిపుణులను మీడియాకి వెల్లడిస్తామని చిత్రబృందం ప్రకటించింది.

Advertisement

పవర్ స్టార్ పేరుతో రామ్ గోపాల్ వర్మ ఓ సినిమా తీస్తుంటే, వర్మ పై పవన్ ఫాన్స్ ఓ సినిమా తీస్తుండడంతో ఇప్పుడు ఇండస్ట్రీలో సంచలనంగా మారింది.వర్మ తెరకెక్కిస్తున్న పవర్ స్టార్ సినిమాను ఈనెల 25న ఆర్జీవీ వరల్డ్ థియేటర్ వెబ్‌సైట్‌లో వర్మ విడుదల చేస్తున్నారు.

ఇక అదే రోజున దానికి పోటిగా పరాన్న జీవి సినిమాని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే పవర్ స్టార్ ట్రైలర్ రిలీజ్ అవుతున్న జూలై 22వ తేదీనే పరాన్న జీవి ట్రైలర్ కూడా విడుదల చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు