సంక్రాంతి బరిలో పవన్ కళ్యాణ్ ని దించబోతున్న క్రిష్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని రిలీజ్ కి రెడీ అవుతుంది.

మరో వైపు అయ్యప్పన్ కోశియమ్, క్రిష్ దర్శకత్వంలో పీరియాడికల్ మూవీ షూటింగ్ లు పూర్తి చేసే పనిలో ఉన్నాడు.

ఈ రెండు సినిమాలు బ్యాక్ టూ బ్యాక్ షూటింగ్ చేస్తున్నారు.ఇక ఈ రెండు సినిమాల మీద భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

ముఖ్యంగా మొఘలాయిల కాలం నాటి కథాంశంతో తెరకెక్కుతున్న క్రిష్ మూవీ మీద మరిన్ని అంచనాలు ఉన్నాయి.పవన్ కళ్యాణ్ కెరియర్ లో ఇప్పటి వరకు టచ్ చేయని పాయింట్ ని ఈ సినిమాలో ఆవిష్కరించబోతున్నారు.

ఇక విప్లవయోధుడుగా పవన్ కళ్యాణ్ సినిమాలో ఎలా కనిపిస్తాడో చూడాలని చాలా మంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా ఫైనల్ కాగా జాక్వలైన్ ఫెర్నాండెజ్ ఓ కీలక పాత్రలో కనిపిస్తుంది.

Advertisement

ఇదిలా ఉంటే పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా రిలీజ్ డేట్ ని దర్శకుడు క్రిష్ తాజాగా ప్రకటించాడు.ఈ సినిమాని సక్రాంతి బరిలో ప్రేక్షకుల ముందుకి తీసుకురాబోతున్నట్లు పోస్టర్ తో రివీల్ చేశారు.

ఇదిలా ఉంటే సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరశురాం దర్శకత్వంలో తెరకెక్కుతున్న సర్కారువారి పాట సినిమా కూడా సంక్రాంతి బరిలోనే రిలీజ్ కాబోతుంది.ఈ నేపధ్యంలో ఇద్దరు స్టార్ హీరోల మధ్య సంక్రాంతి పోటీ అనివార్యం అయ్యింది.

మరో వైపు అయ్యప్పన్ కోశియమ్ సినిమా ఈ ఏడాది చివర్లో రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది.మరి పవన్ కళ్యాణ్ కెరియర్ లో చాలా కీలకంగా రాబోతున్న ఈ సినిమాలు అతనికి ఎలాంటి సక్సెస్ ని ఇస్తాయనేది వేచి చూడాలి.

ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?
Advertisement

తాజా వార్తలు