పవన్ కు తన పార్టీపై నమ్మకం లేదు..: మంత్రి కాకాణి

జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.పవన్ కు తనపై, తన పార్టీపై నమ్మకం లేదన్నారు.

అందుకే ఇతర పార్టీలతో పొత్తులు పెట్టుకుంటున్నారని విమర్శించారు.పవన్ ఓ రాజకీయ అజ్ఞాని అని ఎద్దేవా చేశారు.

అందుకే వాలంటీర్ల మీద ఇష్టం వచ్చినట్లు విమర్శలు చేశారన్నారు.ఇంటింటికి సంక్షేమ పథకాలను చేరవేస్తున్న వాలంటీర్లపై అనుచిత వ్యాఖ్యలు సరికాదని సూచించారు.

ఏపీలో వచ్చే ఎన్నికల్లోనూ వైసీపీనే ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

Advertisement
పుష్ప 2 లో అసలైన ట్విస్ట్ ఇదే...అదిరిపోయిందిగా...

తాజా వార్తలు