మల్టీ స్టారర్‌ ను సింగిల్ స్టార్ చేశారుగా.. పవన్ మూవీపై విమర్శలు

మలయాళంలో సూపర్ హిట్‌ అయిన మల్టీ స్టారర్‌ మూవీ అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌ సినిమాను తెలుగు లో పవన్‌ కళ్యాణ్‌ మరియు రానాలు హీరోలుగా సాగర్ చంద్ర దర్శకత్వంలో రీమేక్ చేస్తున్న విషయం తెల్సిందే.

మల్టీ స్టారర్‌ సినిమా ఏదైనా కూడా ఒక హీరో పేరును పెట్టడం లేదంటే హీరో పాత్రకు సంబంధించిన పేరును పెట్టడం అస్సలు చేయరు.

కాని పవన్‌ కళ్యాణ్‌ సినిమాకు మాత్రం భీమ్లా నాయక్‌అనే టైటిల్‌ ను ఖరారు చేశారు.సినిమాకు భీమ్లా నాయక్ అని టైటిల్ పెట్టడంతో ఇది ఎలా మల్టీ స్టారర్ అవుతుంది అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు.

మల్టీ స్టారర్ సినిమా అని కొందరు కామెంట్స్ చేస్తున్నా మరి కొందరు మాత్రం ఇది పవన్‌ మూవీ అందుకు టైటిల్ సాక్ష్యం అన్నట్లుగా కామెంట్స్ చేస్తున్నారు.ఇప్పటి వరకు సినిమా నుండి వచ్చిన ప్రతి అప్‌ డేట్ కూడా పవన్ కళ్యాణ్‌ దే అవ్వడం వల్ల కూడా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

మల్టీ స్టారర్ సినిమాను కాస్త సోలో హీరో మూవీగా మార్చేశారుగా అంటూ ఒక జర్నలిస్ట్‌ చేసిన ట్వీట్‌ కు గాను నిర్మాత నాగవంశీ స్పందిస్తూ ముందు ముందు చాలా ఉంది.ఇప్పటి నుండే ఎందుకు తొందర అన్నట్లుగా ట్వీట్‌ చేశాడు.

Advertisement

మొత్తానికి చిత్ర యూనిట్‌ సభ్యులు సినిమా తీస్తున్న తీరుపై తెగ విమర్శలు వస్తున్నాయి. త్రివిక్రమ్‌ ఉన్నాడు కనుక ఖచ్చితంగా పవన్‌ ను హైలైట్‌ చేస్తాడు.

అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌ సినిమా లో హీరోలు ఇద్దరికి సమాన ప్రాముఖ్యత ఉంటుంది.కాని ఈ సినిమా లో మాత్రం ఖచ్చితంగా పవన్ కు 80 శాతం ప్రాముఖ్యత ఉండగా రానాకు కేవలం 20 శాతం మాత్రమే ఉంటుందనే అభిప్రాయంను వ్యక్తం చేస్తున్నారు.అదే కనుక నిజం అయితే ముందు ముందు మరింతగా విమర్శలు ఎదుర్కోవాల్సి ఉంటుందని నెటిజన్స్‌ మరియు సినీ వర్గాల వారు అభిప్రాయం తెలియజేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు