పాకిస్థాన్ మనకు శత్రు దేశం.అది మనతో ఎప్పుడూ వైరాన్ని కోరుకుంటుంది.
కానీ మనం మాత్రం ఎవరితోనైనా స్నేహంగా ఉండేందుకే యత్నిస్తున్నాం.అయితే ఆ దేశంలో ఉండే నాయకుల, సో కాల్డ్ పెద్దల సంగతి పక్కన పెడితే అసలు పాకిస్థాన్లో సాధారణ ప్రజలకు మాత్రం మన దేశంలో ఉండే ప్రజలంటే అభిమానమే.
ఇక ఆ దేశానికి చెందిన కొందరు అయితే మన దేశానికి చెందిన పలువురు సెలబ్రిటీలు అంటే ఇష్ట పడతారు.వారు సినిమా లేదా క్రీడా.
ఏ రంగానికి చెందిన వారు అయినా కావచ్చు.పాకిస్థాన్ పౌరులు కొందరు వారంటే అభిమానం చూపిస్తారు.
ఇప్పుడు మేం చెప్పబోయేది కూడా ఇలా అభిమానం చూపించే ఓ పాకిస్థాన్ వ్యక్తి గురించే.అతని పేరు చికాగో చాచా.
పేరుకు తగినట్టుగానే చికాగో చాచా ఉండేది చికాగోలో.ఈయన అసలు పేరు మహమ్మద్ బషీర్.చికాగోలో ఉంటాడు.క్రికెట్ అంటే అభిమానం.పాకిస్థాన్ మ్యాచ్లకు హాజరై తమ టీంకు సపోర్ట్ను ఇస్తుంటాడు.అయితే 2011లో పంజాబ్లోని మొహాలీలో పాకిస్థాన్కు, మనకు వరల్డ్కప్ సెమీ ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది.
మ్యాచ్కు చికాగో చాచా వచ్చాడు కాగా, అతని వద్ద టిక్కెట్లు లేవు.ప్రయత్నించినా దొరకలేదు.
దీంతో తనకు మ్యాచ్ చూడాలని ఉంది, కానీ టిక్కెట్లు లేవు, హెల్ప్ చేయండి అంటూ అతను స్టేడియం బయట ప్ల కార్డు పట్టుకుని నిలుచున్నాడు.
తరువాత కొంతసేపటికి ఓ వ్యక్తి వచ్చి చికాగో చాచాకు మ్యాచ్ టిక్కెట్లు ఇచ్చాడు.ధోనీ స్వయంగా ఆ టిక్కెట్లను పంపారని చెప్పాడు.దీంతో చికాగో చాచా ఆనందానికి అవధులు లేవు.
అప్పటి నుంచి అతను ధోనీ ఫ్యాన్ అయిపోయాడు.అయితే నిజానికి అసలు ధోనీ అంటే అప్పటి వరకు అతనికి తెలియదట.
కానీ ధోనీ చేసిన ఆ పనికి అతనికి చాచా పెద్ద ఫ్యాన్ అయ్యాడు.ప్రస్తుతం శ్రీలంకలో జరుగుతున్న మ్యాచ్లకు వస్తున్నాడు.
ఇండియన్ టీంకు సపోర్ట్నిస్తున్నాడు.ఏది ఏమైనా అభిమానం దేశ హద్దులను చెరిపి వేస్తుందనడానికి ఇది నిదర్శనం కదా.!
.