ఓంకార్‌ అన్నయ్య మళ్ళీ రాబోతున్నాడు..?

తెలుగు బుల్లి తెర సెన్సేషన్‌ ఓంకార్‌ దర్శకుడిగా వరుస చిత్రాలను చేస్తున్నాడు.

ఒక వైపు బుల్లి తెరపై ఈయన తన జర్నీని కొనసాగిస్తూనే మరో వైపు ఈయన సినిమాలు చేస్తూ వస్తున్నాడు.

రాజుగారిగది సిరీస్‌ లో ఇప్పటి వరకు ఈయన మూడు సినిమాలు చేశాడు.మొదటి సినిమా మాత్రమే సూపర్‌ హిట్‌ అయ్యింది.

రెండవ పార్ట్‌ లో నాగార్జున, సమంత వంటి స్టార్స్‌ ఉన్నా కూడా ఆ సినిమా సక్సెస్‌ అవ్వలేదు.మూడవ పార్ట్‌ గురించి ఎంత మాట్లాడుకుంటే అంత మంచిది అన్నట్లుగా ఉంది.

అయినా కూడా ఓంకార్‌ నాల్గవ పార్ట్‌ కు సిద్దం అయ్యాడు.ఈసారి ఓంకార్‌ హాట్‌ స్టార్‌ వారితో ఒప్పందం చేసుకుని సినిమాను నిర్మిస్తున్నాడు.

Advertisement

డైరెక్ట్‌ గా ఓటీటీలో విడుదల చేసే అవకాశం ఉంది.ఒకటి రెండు నెలల్లోనే సినిమాను విడుదల చేసేందుకు దర్శకుడు రెడీ అవుతున్నాడు.

ఈసారి మరింత ఎంటర్‌టైన్‌ మెంట్‌ మరియు హర్రర్‌ సీన్స్‌ ఉండబోతున్నాయి అంటూ ఓంకార్‌ సన్నిహితుల వద్ద చెబుతున్నాడట.మొదటి మూడు పార్ట్‌ ల్లో నటించిన తన తమ్ముడు అశ్విన్‌ బాబును ఈ పార్ట్‌ లో నటింపజేస్తున్నాడు.

ప్రముఖ కమెడియన్స్‌ కూడా ఇందులో కనిపించబోతున్నారు.

మొదటి పార్ట్‌ కు దగ్గరగా ఇది ఉంటుందని యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు.ఇప్పటికే షూటింగ్‌ ప్రారంభం అయిన ఈ సినిమాను హైదరాబాద్‌ లోని ఒక ఫామ్‌ హౌస్‌ లో ఓంకార్‌ చిత్రీకరిస్తున్నాడట.సినిమాలోని ఎక్కువ సీన్స్‌ ఒకే బిల్డింగ్‌ లో ఉండబోతున్నాయట.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
జూనియర్ ఎన్టీఆర్ పేరు బాలయ్యకు నచ్చదా.. తన తండ్రి పేరు దక్కడం బాలయ్యకు ఇష్టం లేదా?

రాజు గారి గది 4 సినిమాకు సంబంధించిన ప్రకటన అధికారికంగా అతి త్వరలో వచ్చే అవకాశం ఉంది.మరి ఈసారి అయినా ఓంకార్‌ సక్సెస్‌ ను దక్కించుకుంటాడో చూడాలి.

Advertisement

తాజా వార్తలు