గత కొంతకాలంగా తెలుగు రాష్ట్రాల్లో కియారా అద్వానీ పేరు బాగా వినిపిస్తోంది.తెలుగులో కేవలం రెండే సినిమాలు చేసిన కియారా అద్వానీ పేరు ప్రతి పాన్ ఇండియా ప్రాజెక్ట్ లో వినిపిస్తోంది.
బాలీవుడ్ లో మంచి ఆఫర్లు చేతిలో ఉన్నా టాలీవుడ్ నుంచి ఆఫర్లు వస్తే ఆచితూచి కియారా అద్వానీ ఎంపిక చేసుకుంటున్నారు.చరణ్ శంకర్ ప్రాజెక్ట్ కు ఓకే చెప్పిన కియారా అద్వానీ జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబో మూవీకి యస్ చెప్పారో నో చెప్పారో తెలియాల్సి ఉంది.
చరణ్ ఇప్పటికే కియారా అద్వానీతో వినయ విధేయ రామ సినిమాలో నటించగా ఎన్టీఆర్ మాత్రం కియారా అద్వానీతో కలిసి నటించలేదు.చరణ్ కియారా అద్వానీ మంచి స్నేహితులు కావడంతో చరణ్ అడిగిన వెంటనే కాదనకుండా కియారా యస్ చెప్పినట్టు సమాచారం.
అయితే ఎన్టీఆర్ కు ఈ బ్యూటీ నో చెప్పారో యస్ చెప్పారో స్పష్టత లేకపోయినా ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం కియారాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అయితే కొరటాల శివ దర్శకత్వంలో ఇప్పటికే నటించిన కియారా అద్వానీ శంకర్ సినిమాలో కూడా నటించాలని భావించి శంకర్ సినిమాకు ఓకే చెప్పి ఉండవచ్చని ఆమె ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.ఎన్టీఆర్ ఫ్యాన్స్ దారుణంగా కియారాను ట్రోల్ చేస్తుండగా కియారా ఆ ట్రోల్స్ గురించి స్పందిస్తారో లేదో చూడాల్సి ఉంది.కియారా సరసన నటించే బ్యూటీ ఎవరో స్పష్టత రావాల్సి ఉంది.