ప్యారిస్ లో ఎన్టీఆర్ ఫ్యామిలీ.. కొడుకును ముద్దాడుతున్న ఫోటో వైరల్?

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఎన్టీఆర్ ప్రస్తుతం షూటింగ్ లో బిజీ బిజీగా ఉన్నాడు.

ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ టాలీవుడ్ దర్శక దీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కతున్న ఆర్ఆర్ఆర్ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే.ఎప్పుడు షూటింగ్లో బిజీబిజీగా ఉండే ఎన్టీఆర్ సమయం దొరికినప్పుడల్లా తన కుటుంబం కోసం సమయాన్ని కేటాయిస్తుంటారు.

అయితే ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ తన కుటుంబంతో కలసి విదేశీ పర్యటనలో ఉన్నారు.తన భార్య ప్రణతి, కొడుకులు అభయ్ రామ్, భార్గవ్ రామ్ తో కలిసి ప్యారిస్ లో హాలిడే ట్రిప్ ఎంజాయ్ చేస్తున్నారు.

అందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ప్యారిస్ లో తన ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తున్న ఎన్టీఆర్, ఈ క్రమంలోనే తన కొడుకు అభయ్ రామ్ తో కలిసి దిగిన ఫోటోను తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు.

Advertisement

ఈఫిల్ టవర్ ముందు కొడుకు అభయ్ బుగ్గలపై ఎన్టీఆర్ ప్రేమతో ముద్దు పెడుతుండగా అభయ్ నవ్వులు చిందిస్తున్నాడు.ఈ ఫోటో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది.

తండ్రి ప్రేమను చూపిస్తున్నాడని ఎన్టీఆర్ అభిమానులను కామెంట్స్‌ చేస్తున్నారు.

ఎన్టీఆర్ ఒక వారం, పది రోజులు ప్యారిస్ లోనే ఉండనున్నారని తెలుస్తోంది.ఇప్పటి వరకు ఆర్‌ఆర్‌ఆర్‌ షూటింగ్‌తో బిజీగా ఉన్న యంగ్‌ టైగర్‌ ఇటీవలే చిత్రీకరణ పూర్తి చేసుకున్నారు.ఆర్ఆర్ఆర్ సినిమాలో ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌, అజయ్‌ దేవ్‌గణ్‌, అలియా భట్‌ ముఖ్యపాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే.

ఈ సినిమా జనవరి 7 న ప్రేక్షకుల ముందుకు రానుంది.ఇందులో ఎన్టీఆర్‌ కొమరం భీమ్‌గా కనిపించనున్నారు.

ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?
Advertisement

తాజా వార్తలు