ఈ నెల 21వ తారీఖున వస్తోన్న నితిన్ భీష్మ...

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ నటించిన టువంటి చిత్రం భీష్మ.ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు వెంకీ కుడుముల దర్శకత్వం వహించాడు.

ఈ చిత్రంలో నితిన్ సరసన కన్నడ బ్యూటీ రష్మిక మందన్న జోడీగా నటించింది.అయితే తాజాగా చిత్ర యూనిట్ సభ్యులు ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 21వ తారీకున విడుదల చేస్తున్నట్లు తెలిపారు.

 అంతేగాక ఈ విషయానికి సంబందించిన పోస్టర్ కూడా విడుదల చేశారు.అయితే గతంలో చలో సినిమాతో హిట్ కొట్టినటువంటి దర్శకుడు వెంకీ కుడుముల ఈసారి అదే ఫార్ములాను ఉపయోగించి మరోసారి హిట్ కొట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

అయితే గతంలో నితిన్ నటించిన టువంటి పలు చిత్రాలు వరుసగా బాక్సాఫీసు వద్ద బోల్తా పడుతుండటంతో నితిన్ తన ఆశలన్నీ ఆ చిత్రంపైనే పెట్టుకున్నాడు.అయితే ఈ చిత్రానికి సంబంధించి నటువంటి పొలిటికల్ పాటలు మరియు టీజర్ విడుదలై మంచి ప్రేక్షకాదరణ పొందాయి. దీంతో మరి బాక్సాఫీస్ వద్ద భీష్మ చిత్రం ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.

Advertisement
బీజేపీ కార్మిక, కర్షక వ్యతిరేక పార్టీ.. మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శలు

తాజా వార్తలు