కార్తికేయ 2 మళ్ళీ వాయిదా పడిందా.. కారణం ఏంటంటే?

నిఖిల్ సిద్దార్థ్ తన టాలెంట్ తో వరస హిట్లు కొట్టి మినిమమ్ గ్యారెంటీ హీరోగా నిలదొక్కుకున్నాడు.

హ్యాపీ డేస్ సినిమాతో తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చిన ఈ యంగ్ హీరో తన ఖాతాలో మంచి హిట్స్ నే వేసుకున్నాడు.

ప్రెసెంట్ నిఖిల్ నటిస్తున్న సినిమాల్లో 18 పేజెస్ ఒకటి.ఈ సినిమాను కుమారి 21F సినిమా ఫేమ్ సూర్య ప్రతాప్ పల్నాటి తెరకెక్కిస్తున్నాడు.

ఈ సినిమాకు టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ కథను రాయడంతో ఈ సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది.ఈ సినిమా త్వరలోనే రిలీజ్ అవ్వబోతుంది.

అలాగే నిఖిల్ కార్తికేయ 2 సినిమా కూడా చేస్తున్నాడు.ఈయన కెరీర్ లో కార్తికేయ సినిమా ఎంత హిట్ అయ్యిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు.

Advertisement

ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ గా కార్తికేయ 2 చేస్తున్నాడు.చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నిఖిల్ లోని కొత్త కోణాన్ని ఆవిష్కరించింది.

సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్ లో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులకు బాగా నచ్చడంతో సూపర్ హిట్ అయ్యింది.ఇక ఇప్పుడు చేస్తున్న కార్తికేయ 2 ఎలాంటి సస్పెన్స్ క్రియేట్ చేయనుంది అని ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమా నుండి ట్రైలర్ విడుదల అవ్వగా బాగా ఆకట్టు కుంది.ఇలా ఈ సినిమాపై పాజిటివ్ వైబ్స్ రావడంతో టీమ్ కూడా పక్కా హిట్ గ్యారెంటీ అని నమ్ముతున్నారు.

ఈ క్రమంలో తాజాగా ఈ సినిమా నుండి వచ్చిన ఒక రూమర్ నెట్టింట వైరల్ అవుతుంది.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?

ఈ సినిమాను జులై 22న రిలీజ్ చేయబోతున్న విషయం విదితమే.ఈ క్రమంలో ఈ సినిమా వాయిదా పడింది అంటూ ఒక రూమర్ వైరల్ అవుతుంది.జులై నుండి ఈ సినిమా ఆగష్టు కి షిఫ్ట్ అయినట్టు టాక్ గట్టిగానే ఫిలిం వర్గాల్లో టాక్ నడుస్తుంది.

Advertisement

చూడాలి మరి ఈ వార్త నిజమేనో కాదో.ఇక ఈ సినిమాలో టాలీవుడ్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తుండగా.పీపుల్స్ మీడియా, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పథకాలపై ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

తాజా వార్తలు