ట్రోల్స్ వచ్చినా తగ్గేదేలే అంటున్న సమంత.. ప్రీతమ్ తో అలా?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత చైతన్యతో విడిపోయినా ఆమె సినీ కెరీర్ పై ఏ మాత్రం నెగిటివ్ ఎఫెక్ట్ పడలేదు.

వరుసగా భారీ బడ్జెట్ సినిమాలతో సమంత కెరీర్ పరంగా బిజీగా ఉన్నారు.

గతేడాది పుష్ప ది రైజ్ సినిమాలో స్పెషల్ సాంగ్ ద్వారా వార్తల్లో నిలిచిన సమంత ఈ ఏడాది శాకుంతలం, యశోద సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.ఈ రెండు సినిమాలు సమంత మార్కెట్ ను అమాంతం పెంచుతాయని ఫ్యాన్స్ నమ్ముతున్నారు.

ఇతర స్టార్ హీరోయిన్లతో పోల్చి చూస్తే సమంత రెమ్యునరేషన్ కూడా ఎక్కువేనని సమాచారం.ప్రముఖ కంపెనీల యాడ్స్ లో నటిస్తున్న సమంత అదే సమయంలో సోషల్ మీడియా ద్వారా కొన్ని ఉత్పత్తులను ప్రమోట్ చేస్తున్నారు.

సోషల్ మీడియాలో భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండటం సమంతకు ప్లస్ అవుతోంది.అయితే సమంత ఒక విషయంలో మాత్రం ఫ్యాన్స్ నుంచి విమర్శలను ఎదుర్కొంటున్నారు.

Advertisement

తాజాగా ప్రీతమ్ తో కలిసి దిగిన ఫోటోలను సమంత సోషల్ మీడియాలో షేర్ చేయగా ఆ ఫోటోలు కొంతమంది అభిమానులకు అస్సలు నచ్చడం లేదు.సాధన సింగ్, ప్రీతమ్ లతో డేట్ నైట్ కు వెళుతున్నానంటూ సమంత పోస్ట్ చేయడం గమనార్హం.ఎన్ని విమర్శలు వచ్చినా వాటిని పట్టించుకోకుండా సమంత కెరీర్ విషయంలో ముందడుగులు వేస్తున్నారు.

సమంత విజయ్ దేవరకొండతో కలిసి ఖుషి అనే సినిమా కూడా చేస్తున్నారు.

ఖుషి సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుండగా ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి.మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు ఈ సినిమాను ఖర్చు విషయంలో రాజీ పడకుండా నిర్మిస్తున్నారు.ఒక ఇంటర్నేషనల్ మూవీకి కూడా సమంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది.

సమంత మాత్రం నెగిటివ్ కామెంట్లను పట్టించుకోకుండా ముందుకు వెళుతున్నారు.

సింప్లిసిటీకి పర్‌ఫెక్ట్‌ ఎగ్జాంపుల్‌ ప్రభాస్‌.. వైరల్ అవుతున్న శిరీష్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Advertisement

తాజా వార్తలు