మణిపూర్ ఘటనను ఎన్సీడబ్ల్యూ సుమోటోగా తీసుకుంది.. ఖుష్బూ

మణిపూర్ లో ఇటీవల చోటు చేసుకున్న ఘటనను జాతీయ మహిళా కమిషన్ సుమోటోగా తీసుకుందని సినీ నటి, ఎన్సీడబ్ల్యూ సభ్యురాలు ఖుష్బూ స్పందించారు.

మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనపై తీవ్రంగా మండిపడిన ఆమె సభ్య సమాజం సిగ్గుతో తల దించుకునే ఘటన ఇదని చెప్పారు.

ఈ దారుణానికి ఒడిగట్టిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.మహిళలపై జరిగే అఘాయిత్యాలపై ప్రతి ఒక్కరూ సమిష్టిగా పోరాడాలని సూచించారు.

రాజకీయాలు పక్కన పెట్టి ఇటువంటి ఘటనలు ఎక్కడా పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.

ఎమ్మెల్సీ ఎన్నికలు : రెండు పార్టీల్లోనూ గెలుపు ధీమా 
Advertisement

తాజా వార్తలు