విఘ్నేష్ శివన్ కు దూరమైన నయనతార.. కారణమేమిటంటే..?

కోలీవుడ్ ఇండస్ట్రీలో 4 కోట్ల రూపాయలకు పైగా పారితోషికం తీసుకుంటూ నంబర్ 1 స్టార్ హీరోయిన్ గా నయనతార వరుస అవకాశాలతో బిజీగా ఉన్నారు.

దర్శకుడు విఘ్నేష్ శివన్ తో ప్రేమలో ఉన్న నయనతార ప్రియుడితోనే ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు.

నయనతార విఘ్నేష్ శివన్ కు ఇప్పటికే పెళ్లి జరిగినట్టు గతంలో వార్తలు వైరల్ అయిన సంగతి తెలిసిందే.అయితే గత కొన్ని రోజుల నుంచి నయనతార విఘ్నేష్ శివన్ కు దూరంగా ఉంటున్నారని తెలుస్తోంది.

రజనీకాంత్ హీరోగా తెరకెక్కున్న అన్నాతే సినిమాలో నయనతార హీరోయిన్ గా నటిస్తున్నారు.గతంలో నయనతార, రజనీకాంత్ కాంబినేషన్ లో చంద్రముఖి, కథానాయకుడు, దర్భార్ సినిమాలు తెరకెక్కాయి.

ప్రస్తుతం హైదరాబాద్ లో అన్నాతే సినిమా షూటింగ్ జరుగుతోంది.విఘ్నేష్ శివన్ సమంత, విజయ్ సేతుపతి జంటగా నటిస్తున్న కాథువాకులా రెండు కథల్ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా ఈ సినిమా షూటింగ్ కూడా హైదరాబాద్ లోనే జరుగుతోంది.

Advertisement

అయితే నయనతార, విఘ్నేష్ శివన్ ఒకే నగరంలో ఉన్నా అన్నాతే షూటింగ్ లో కరోనా నిబంధనలు కఠినంగా అమలు చేస్తూ ఉండటం వల్ల షూటింగ్ నుంచి ఎవరూ బయటకు వెళ్లడానికి వీలు లేదని కఠినమైన నిబంధనలు విధించారు.ఈ నిబంధనల వల్ల నయన్, విఘ్నేష్ ఒకరికొకరు దూరం కాక తప్పలేదని తెలుస్తోంది.ప్రేమ పక్షులుగా పేరు తెచ్చుకున్న నయనతార, విఘ్నేష్ శివన్ లు కరోనా వల్ల కొన్ని రోజుల పాటు దూరంగా ఉండక తప్పని పరిస్థితి నెలకొంది.

ఈ ఏడాది అమ్మోరు తల్లి సినిమాతో హిట్ కొట్టిన నయనాతర రజనీకాంత్ సినిమాతో పాటు లేడీ ఓరియెంటెడ్ కథలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.వరుస అవకాశాలతో బిజీగా ఉన్న నయనతార వచ్చే ఏడాది సెకండాఫ్ లో విఘ్నేష్ శివన్ ను పెళ్లి చేసుకోనున్నారని తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు