మంత్రి కోమటిరెడ్డి ప్రజాదర్బార్ పై నల్లగొండ ప్రజల హర్షం...!

నల్లగొండ జిల్లా:రాష్ట్ర రోడ్లు, భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి( Minister Komatireddy Venkat Reddy ) సోమవారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయ సమీపంలోని మున్సిపల్ పార్కులో ప్రజాదర్బార్ ఏర్పాటు చేసి, ప్రజల సమస్యలను శ్రద్ధగా వింటూ,కొన్ని సమస్యలను అక్కడిక్కడే అధికారులతో మాట్లాడి పరుష్కరించడం, కొన్నింటిని పరిష్కరిస్తానని హామీ ఇవ్వడంపై నల్లగొండ పట్టణ,నియోజకవర్గ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

నల్లగొండ పట్టణ,నియోజకవర్గ నలుమూలల నుండి పెద్ద ఎత్తున తరలివచ్చిన జనం మంత్రికి వినతులు సమర్పించినా దాదాపు మంత్రి మూడు గంటల పాటు ప్రజాదర్బారులో ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించడం,ప్రతి ఒక్కరి సమస్యలను ఓపికగా వినడంతో ప్రజలు తమకు పరిష్కారం లభిస్తుందనే ధీమాతో ఉన్నారు.

Latest Nalgonda News