ప్రభాస్ చేసే ఆ రెండు సినిమాలు ఏంటి..?

టాలీవుడ్ పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బాగా బిజీగా ఉన్నాడు.

మొత్తానికే పాన్ ఇండియా సినిమాలకు పరిమితమైన ప్రభాస్ బాలీవుడ్ స్టార్ హీరోలను మించి దూసుకుపోతున్నాడు.

ప్రస్తుతం ప్రభాస్ రాధా కృష్ణ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న రాధేశ్యామ్ సినిమాలో నటిస్తున్నాడు.ఇక ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ బిజీలో ఉండగా మరో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే.

ఇదిలా ఉంటే డైరెక్టర్ ఓమ్ రౌత్ దర్శకత్వంలో ఆది పురుష్ అనే సినిమాలో కూడా నటిస్తున్నాడు ప్రభాస్.ఇక ఇందులో బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ నటిస్తుంది.

అంతే కాకుండా మరో బాలీవుడ్ నటులు సైఫ్ అలీ ఖాన్, సన్నీ సింగ్ కూడా నటిస్తున్నారు.ఇదిలా ఉంటే ఈ సినిమాల తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నాడు ప్రభాస్.

Advertisement

ఇక ఇందులో బాలీవుడ్ నటి దీపికా పదుకొనే కూడా నటించనున్నట్లు తెలిసింది.

ఈ సినిమా 2050 సంవత్సరం నేపథ్యంలో రూపొందుతుందని అంతే కాకుండా టైం ట్రావెల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించనున్నారని తెలిసింది.ఇక నాగ్ అశ్విన్ తన దర్శకత్వంలో వచ్చే సినిమాను రాధేశ్యామ్ సినిమా సమయంలో 21 వ సినిమాగా ప్రకటించాడు.ఇక దాంతో రాధేశ్యామ్ తర్వాత ఆది పురుష్, సలార్ సినిమాలు రావడంతో నాగ్ అశ్విన్ సినిమా 23వ దానికి చేరుకుంది.

ఇదిలా ఉంటే నాగ్ అశ్విన్ సినిమాకు సినిమాటోగ్రాఫర్ అందిస్తున్న డానీ సాలో తన ఇన్ స్టా గ్రామ్ వేదికగా ప్రభాస్ 25వ మూవీ ఓ మైలురాయి అని అర్థం వచ్చేలా తెలిపాడు.దీంతో నాగ్ అశ్విన్ సినిమా 25వ సినిమా అయితే మరి 23, 24 సినిమాలు ఎవరితో చేయనున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.ఇక ప్రభాస్ సలార్ సినిమా తర్వాత సిద్ధార్థ్ ఆనంద్ తో, ప్రశాంత్ నీల్ తో వరసగా సినిమాలు చేయనున్నట్లు సమాచారం.

ఇక ఈ సినిమాలన్నీ పూర్తయిన తర్వాతే నాగ్ అశ్విన్ సినిమా రానున్నట్లు తెలుస్తుంది.

అందివచ్చిన అవకాశాన్ని ఈ ఇద్దరు హీరోయిన్స్ ఉపయోగించుకుంటారా ?

Advertisement

తాజా వార్తలు