నా బీటెక్ అయిపోయింది.. ఆర్ఆర్ఆర్ మాత్రం విడుదల కాలేదంటూ అభిమాని కామెంట్?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శక ధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం RRR గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమా 2017 వ సంవత్సరంలో షూటింగ్ ప్రారంభించింది.

అయితే కరోనా కారణం వల్ల సినిమా షూటింగ్ పూర్తి చేసుకో లేకపోయింది.ఈ క్రమంలోనే ఈ సినిమా ఇప్పటి వరకు విడుదలకు నోచుకోలేదు.

ఇదిలా ఉండగా తాజాగా ఒక అభిమాని ఈ సినిమా గురించి చిత్ర బృందానికి అదిరిపోయే కామెంట్ చేశారు.ఈ సందర్భంగా సదరు అభిమాని సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.

ఈ సినిమా నేను డిప్లమా చదివేటప్పుడు ప్రారంభించారు.నేను బీటెక్ పూర్తి చేసుకున్న కూడా సినిమా విడుదల కాలేదంటూ కామెంట్ చేశారు.

Advertisement

ఇలా అభిమాని చేసిన కామెంట్ కు చిత్రబృందం అదిరిపోయే సమాధానం చెప్పారు.ఈ సందర్భంగా చిత్ర బృందం స్పందిస్తూ.

ఏం చేద్దాం మరి నువ్వు కాలేజీకి వెళ్ళినన్ని రోజులు కూడా మేము సినిమా షూటింగ్ చేయలేదని చిత్రబృందం రిప్లై ఇచ్చారు.ఇలా ఈ సినిమా విడుదల గురించి వీరి మధ్య జరిగిన సంభాషణ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.2017 లో ప్రారంభించిన ఈ చిత్రం ఎన్నో అడ్డంకులను ఎదుర్కొని ఇప్పటికీ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది.ఈ క్రమంలోనే ఈ విధమైనటువంటి ప్రశ్న ఎదురవడంతో చిత్ర బృందం కూడా అదే రీతిలో సమాధానం చెప్పారు.

రాజమౌళి దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ కీలక పాత్రలో నటిస్తున్నారు.ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో నటించగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నారు.ఇప్పటికే సినిమా నుంచి విడుదలైన పాటలు టీజర్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

చరిత్రలో ఎప్పుడూ కలవని ఇద్దరు యోధులను రాజమౌళి చిత్రం ద్వారా కలపనున్నారు.ఈ క్రమంలోనే ఈ సినిమాపై అటు ఎన్టీఆర్ అభిమానులు, ఇటు రామ్ చరణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

పుష్ప సినిమాతో నాకు వచ్చిందేమీ లేదు.. ఫహద్ ఫాజిల్ షాకింగ్ కామెంట్స్ వైరల్!
కెనడాలో మరోసారి ఖలిస్తాన్ మద్ధతుదారుల ర్యాలీ.. భారత అధినాయకత్వమే లక్ష్యమా..?

అయితే ఈ సినిమా ఈ ఏడాది అక్టోబర్ 13వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతుందని చిత్రబృందం వెల్లడించారు.అయితే అప్పటికి ఇంకా షూటింగ్ పూర్తి కాకపోవడం వల్ల ఈ సినిమాని వచ్చే ఏడాదికి పోస్ట్ పోన్ చేశారు.అయితే ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 7వ తేదీ విడుదల కాబోతుందని చిత్రబృందం అధికారికంగా ప్రకటించారు.

Advertisement

అప్పుడైనా విడుదల చేస్తారా లేదా మరొకసారి వాయిదా వేస్తారా అనే సందేహం అభిమానులలో కలుగుతూనే ఉంది.ఇలా ఈ సినిమా కోసం ఎదురు చూస్తూ ఎంతో విసుగు చెందిన అభిమానులు చివరికి ఏకంగా చిత్ర బృందానికి ఈ విధమైనటువంటి మెసేజ్ చేశారు.

ఐదు భాషలలో తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 17వ తేదీ విడుదల కానుందని తెలియడంతో అభిమానులు వేయి కళ్ళతో ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు.ఇక తాజాగా ఈ సినిమా నుంచి విడుదల చేసిన నాటు నాటు అనే పాట సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.ఇందులో చరణ్, ఎన్టీఆర్ పోటీపడి మరీ డాడ్ చేయడంతో ఈ పాట యూట్యూబ్ లో రికార్డులు సృష్టిస్తుందని చెప్పవచ్చు.

తాజా వార్తలు