అరెరె: ఇకపై ఆ కంపెనీ లో గోల్డ్ లోన్ తీసుకుంటే, కోవిడ్ ఇన్సూరెన్స్ ఫ్రీ అట...!

కరోనా వైరస్ నేపథ్యంలో అనేక మంది ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంగతి అందరికీ విదితమే.

లాక్ డౌన్ నేపథ్యంలో అనేక పరిశ్రమలు మూతపడటంతో కొన్ని లక్షల మంది రోడ్డు పాలు అయ్యారు.

దీంతో అనేకమంది ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయారు.ఈ పరిస్థితుల నడుమ అనేకమంది పర్సనల్ లోన్ తోపాటు, గోల్డ్ లోన్ కూడా తీసుకుంటున్నారు.

పలు ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు గోల్డ్ పై అతి తక్కువ వడ్డీకి రుణాలు ఇచ్చేందుకు ఆసక్తి చూపించడంతో బ్యాంకుల మధ్య పోటీ తత్వం పెరిగింది.అయితే ఈ ఆఫర్ల నడుమ అనేక మంది బంగారం లోన్స్ తీసుకునేందుకు తెగ ఆసక్తి చూపిస్తున్నారు.

ఈ పరిస్థితుల నడుమ ప్రముఖ ఫైనాన్స్ రంగ సంస్థ ముత్తూట్ ఫైనాన్స్ లో సరికొత్త ఆఫర్ ను తీసుకువచ్చింది.ఇక ఎవరైతే ముత్తూట్ ఫైనాన్స్ లో బంగారం లోన్ తీసుకుంటారో వారికి ఉచితంగా కోవిడ్ ఇన్సూరెన్స్ చేయిస్తామని కంపెనీ ప్రకటించింది.

Advertisement

ఈ నేపథ్యంలో ముత్తూట్ ఫైనాన్స్ మహీంద్రా బ్యాంకు తో భాగస్వామ్యం జత పరిచింది.

ఇకపోతే ముత్తూట్ ఫైనాన్స్ సంస్థలు ఆయుష్ గోల్డ్ లోన్ స్కీమ్ కింద బంగారం రుణం తీసుకుంటే ఖచ్చితంగా కోవిడ్ ఇన్సూరెన్స్ ఉచితంగా పొందవచ్చు.ఈ నేపథ్యంలో లోన్ తీసుకున్న వ్యక్తికి పొరపాటున కరోనా సోకినా వారికీ ఒక లక్ష వరకు ఇన్సూరెన్స్ కవరేజ్ లభించనుంది.ప్రస్తుతం ఉన్న నేపథ్యంలో వారి కస్టమర్లకు సాయం చేయడం కోసమే ఇలాంటి ఆఫర్ ను అందుబాటులోకి తీసుకువచ్చామని ముత్తూట్ యాజమాన్యం తెలియజేసింది.

ప్రస్తుతం ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో చాలా మంది బంగారం లోన్స్ తీసుకుంటున్నారని, అలాంటి వారికి మా సంస్థ తరఫున వీలైనంత సహాయం చేయాలనే ఉద్దేశంతో ఈ ఇన్సూరెన్స్ పాలసీ విధానాన్ని తీసుకువచ్చినట్లు స్పష్టం చేశారు.

పర్షియన్ కార్పెట్ లాంటి కేక్ ఎప్పుడైనా చూశారా.. వీడియో చూస్తే ఫిదా..
Advertisement

తాజా వార్తలు