విజయవాడ: వాలంటీర్ల పై ఎంపీ కేశినేని నాని కామెంట్స్.వాలంటీరు వ్యవస్థ అనేది పార్టీలకు అతీతంగా పనిచేస్తుంది.
ఎ ప్రభుత్వ ఉద్యోగి ఐనా ప్రజల కోసం పనిచెయ్యాలి.స్వతంత్రం వచ్చినప్పటి నుండి ఎంతో మంది ముఖ్యమంత్రులు అయ్యారు ప్రధాన మంత్రులు అయ్యారు.
ఒక్కక్కరు ఒక్కో వినూత్నమైన ఆలోచనలతో దేశాన్ని పాలించారు.అదే రీతిలో ఇవ్వాళ వాలంటీరు ఐనా, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి ఐనా, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి ఐనా, నేను ఐనా సరే ప్రజల కోసం పనిచెయ్యాలి.
ఆ రోజున టీడీపీ ప్రభుత్వం జన్మబూమి కమిటీ పెట్టింది దాన్నే ఈ రోజు వాలంటీరు వ్యవస్థ అంటున్నారు.మేము మళ్ళీ ప్రభుత్వం స్థాపిస్తే ఇలాంటి మంచి వ్యవస్థ ఉంటే కంటిన్యూ చేస్తాం అని చంద్రబాబు నాయుడు చెప్పారు.
ప్రతీ వ్యవస్థలో మంచి చేడు రెండు ఉంటాయి.నలుగురు అయిదుగురు గురించి అందరిని అనడం కరెక్ట్ కాదు.