జేసీ దివాకర్ రెడ్డి.అనతపురం ఎంపీ.
సంచలనాలకి కేంద్రబిందువు.జేసీ బ్రదర్స్ అంటేనే నోరేసుకుని పడిపోతారు అని అంటారు.
జేసీ ఏ పార్టీలో ఉన్నా సరే ఉన్నది ఉన్నట్లుగా కుండ బద్దలు కొడుతూ మాట్లాడటం అలావాట.అది చంద్రబాబు అయినా.
జగన్ అయినా సరే.ఎంతో కోపంగా ఉండే జేసీ ఎన్నో సార్లు వివాదాల్లో చిక్కుకున్నారు కూడా ఆమధ్య విమానయాన సిబ్బందితో వాగ్వాదానికి దిగి అతనిపై దాడి చేయడం.అందరికీ తెలిసిందే.కామన్ గా చెప్పాలి అంటే జేసీకి కొంచం నోటి దురుసు ఎక్కువే
అయితే ఈ మధ్య చంద్రబాబు కి దూరం అవుతున్నాడు.ఈ సారి బాబు టికెట్ ఇవ్వడు అని ఫిక్స్ అయిన జేసీ నేను ఈ ఎన్నికల్లో పోటీ చేయను.చంద్రబాబు అనుగ్రహం ఉంటే మాత్రం నాకొడుకు రాజకీయాల్లోకి దిగుతాడు అంటూ తన కోరికని మీడియా ముందు బయట పెట్టాడు జేసీ.
అందుకే చంద్రబాబు అనుగ్రహం కోసం జేసీ వేయని వేషం లేదు అంటూ టిడిపిలో సీనియర్స్ చెవులు కొరుక్కుంటున్నారు.నిన్నటికి నిన్న పవన్ కళ్యాణ్, చిరులపై సంచలన వ్యాఖ్యలు చేసిన జేసీ.
ఇప్పుడు ఏకంగా భారత ప్రధానమంత్రి పై సంచలన కామెంట్స్ చేశారు.అంతేకాదు ఇది బిజీపి జాగీరు కాదు అంటూ వార్నింగ్ కూడా ఇచ్చారు
బిజెపి మంచి ఆకలిగా ఉంది.
ప్రతీ రాష్ట్రలో తమ ఆధిపత్యాన్ని ప్రదర్శిచడానికి ఎన్నో ప్రణాలికలు వేస్తోంది.ఇప్పుడు ఏపీ టిడిపి.
పై తమ ప్రతాపం చూపించాలి అనుకోవడం అంత మంచిది కాదు అని.పోలవరాన్ని అడ్డుకోవడం వెనుక అసలు మతలబు ఏంటి అని ప్రస్నిచారు.చంద్రబాబుని నియంత్రించాలని చూడటం మంచిది కాదని.అటువంటి విధానాలు ఏమన్నా ఉంటే విరమించుకోవడం మంచిది అని బిజెపి కి చురకలు అంటించారు బాబు.ఇది బిజేపి వాళ్ళ జాగీరు కాదు.మేము బిజేపికి బానిసలం కూడా కాదు అంటూ ఫైర్ అయ్యారు.
మాజోలికి వస్తే బిజేపికి ఎపీలో దిక్కు మొక్కు కూడా ఉండదు అని ప్రకటించారు.డిసెంబరు 15 నుంచి మొదలవుతున్నాయి కాబట్టి ఈలోగానే కేంద్రం ఈ విషయంలో స్పష్టమైన వైఖరిని చెప్పాలని జేసీ కేంద్రానికి తెలిపారు.
ఇప్పుడు ఈ కామెంట్స్ బిజెపి వర్గాలలో తీవ్రమైన అలజడిని కలిగిస్తున్నాయి.ఏకంగా బిజెపి అగ్రనాయకత్వానికి అల్టిమేటం ఇవ్వడంతో మరి బిజెపి నేతలు ఎలా స్పదిస్తారో వేచి చూడాలి.