చంద్రబాబు రాజకీయ చతురత ముందు ఎవ్వరైనా సరే దిగదుడుపే.చంద్రబాబు తన నీడని కూడా నమ్మడు అంటారు.
అలాంటిది పవన్ కళ్యాణ్ ని గుడ్డిగా నమ్మేస్తాడు అని ఎవరు అనుకోరు.పవన్ కళ్యాణ్ తో స్నేహభందం ఉన్నా సరే రాజకీయం రాజకీయమే.
ఇప్పుడు ఈ విషయాల గురించి చర్చ ఎందుకు అనేకదా డౌట్.ఎందుకంటే.
ఈ మధ్య అనంతపురం జిల్లా విషయంలో చంద్రబాబు తీసుకుంటున్న నిర్ణయాలు పవన్ కళ్యాణ్ కి చెక్ పెట్టేలా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.అయితే అనంతలో వైసీపి ప్రభావం తగ్గాలి అంటే.
గుర్నాధరేద్ది చేరిక తప్పని సరి అనేది బాబు వ్యూహం
ఈ సారి అనంతపురం ఎంపీ సీటు మీద కూడా తీవ్రస్థాయిలో పోటీ ఉండబోతోంది.అయితే ఈసారి నేను రాజకీయాలకి దూరంగా ఉంటాను అని ప్రకటించిన జేసీ నా కొడుకుని రంగంలోకి దింపాలని అనుకుంటున్నట్టుగా తెలిపారు.
బాబు కూడా ఎంపీ విషయంలో జేసీ వర్గానికే సపోర్ట్ చేయవచ్చు అని టాక్ ఎందుకంటే.అనంతపురం అంటే జేసీ బ్రదర్స్ కి పెట్టిన కోట.అక్కడ తన తనయుడు అంటే కిందా,మీద పది మరి గెలిపించుకోగల సత్తా ఉంది సో ఈ విషయంలో గెలుపు మీద నో డౌట్.ఈ ఈక్వేషన్స్ లో చుస్తే తెలుగు దేశం హవా కొనసాగుతుంది
ఇవన్నీ పక్కన పెడితే మరొక ఆసక్తికరమైన విషయం ఏమిటి అంటే.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్.అనంతపురం నుంచీ పోటీ చేస్తాను అని ప్రకటించిన విషయం తెలిసిందే.
అయితే అనంతపురంలో బాలా బలాలు…సరైన కాలిక్యులేషన్స్ లు వేసుకోకుండా పవన్ పోటీ చేసేస్తాను అని చెప్పడం.పవన్ ఇంకా అనంతపురం లో రాజకీయ అడుగు పెట్టకముందే.
టిడిపి అధినేత తన అక్కడ తన హవా కొనసాగించడం.పవన్ కి ఒక్క మార్గం కూడా లేకుండా దారులు అన్ని మూసేయడం జరిగిపోయింది.
అంటే ఒక వేళ జనసేనతో పొట్టు టిడిపికి లేకపొతే.టిడిపికి-జనసేనకి పోటీ నువ్వా నేనా అనేట్టుగా ఉంటుంది అంటున్నారు విశ్లేషకులు.
ఒకవేళ పొట్టు ఉంటే మాత్రం అటు గురునాధ రెడ్డి.ప్రభాకర్ రెడ్డి ఇద్దరు ఏమయ్యిపోతారో.