టాలీవుడ్ లో హీరోయిన్ గా కెరియర్ స్టార్ట్ చేసి సుడిగాడు సినిమాలో అల్లరి నరేష్ కి జోడీగా కనిపించిన గుజరాతీ భామ మోనాల్ గజ్జర్. ఈ అమ్మడు సుడిగాడు సినిమా తర్వాత ఆఫర్స్ వచ్చిన కూడా వద్దనుకొని కొంత కాలం టాలీవుడ్ కి దూరమైంది.
ఆ సమయంలో మాతృభాషలో సినిమాలు చేస్తూ బిజీ అయ్యింది.గత ఏడాది బిగ్ బాస్ సీజన్ 4లోకి మోనాల్ గజ్జర్ ఊహించని విధంగా పార్టిసిపెంట్ గా ఎంట్రీ ఇచ్చింది.
ఇక హౌస్ లో కో పార్టిసిపెంట్ అఖిల్ సార్ధక్ తో ఆన్ స్క్రీన్ రొమాన్స్ తో మరోసారి ఈ బ్యూటీ తెలుగునాట పాపులర్ అయ్యింది.ఇక హౌస్ నుంచి బయటకి రాగానే బెల్లంకొండ అల్లుడు అదుర్స్ మూవీలో ఐటెం సాంగ్ లో సందడి చేసింది.
తర్వాత ఓంకార్ డాన్స్+ షోలో జడ్జ్ గా బుల్లితెరలో సందడి చేసింది.ఇదిలా ఉంటే ఇప్పుడు బుల్లితెరపై మరోసారి మోనాల్ సందడి మొదలు కాబోతున్నట్లు తెలుస్తుంది.
అయితే ఈ సారి ఆమె ఏకంగా యాంకర్ గా కనిపించాబోతుందని టాక్.స్టార్ మా ఛానల్ కొత్తగా ఓ కామెడీ రియాలిటీ షో స్టార్ట్ చేయబోతుంది.
ఇక ఈ షోకి యాంకర్ గా మోనాల్ గజ్జర్ ని ఫైనల్ చేసినట్లు సమాచారం.తెలుగులో పెద్దగా రాని రష్మి యాంకర్ గా సక్సెస్ అయినపుడు మోనాల్ కూడా తన వచ్చిరాని తెలుగు బాషతో, తన హాట్ షోతో సక్సెస్ అవుతుందని, షోకి మంచి రేటింగ్స్ వచ్చే అవకాశం ఉందని స్టార్ మా భావించి ఆమెని ఎంపిక చేసినట్లు టాక్.