తలపొగరు బ్యూటీకి తప్పని తిప్పలు.. బ్యాన్‌ చేసే అవకాశం

ట్యాలెంట్‌ ఉన్నదనే పొగరో లేకుంటే ఆమె పద్దతే అలాగో కాని నిత్యామీనన్‌కు చాలా పొగరు అనే విమర్శలు చాలా రోజులుగా ఎదుర్కొంటూనే ఉంది.

కెరీర్‌ ఆరంభం నుండి కూడా నిత్యామీనన్‌ పొగరుబోతు మాటలు, ప్రవర్తన కారణంగా ఇండస్ట్రీలో చాలా ఆఫర్లు వదులుకుంది.

అప్పట్లో ప్రభాస్‌ ఎవరో నాకు తెలియదు అన్న నిత్యామీనన్‌, ఆ తర్వాత పలువురు దర్శకులకు కూడా తన పొగరును చూపించింది.తాజాగా మలయాళ చిత్ర పరిశ్రమకు చెందిన నిర్మాతలు మొత్తం కూడా ఈమెపై బ్యాన్‌ విధించాలనే నిర్ణయానికి వచ్చారు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.ఇటీవల కొన్ని రోజులుగా మలయాళ చిత్ర నిర్మాతలు కొందరు నిత్యామీనన్‌ను కలిసేందుకు ప్రయత్నిస్తున్నారు.

కాని ఏ ఒక్కరికి కూడా ఆమె డేట్లు ఇచ్చేందుకు ఆసక్తి చూపడం లేదు.అసలు ఆమె వారిని కలిసి మాట్లాడేందుకు కూడా ఆసక్తి చూపడం లేదు.

Advertisement

అలాంటి సమయంలో ఆ నిర్మాతలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.మలయాళ సినిమా పరిశ్రమను చిన్న చూపు చూస్తున్న నిత్యామీనన్‌ను మనం ఎందుకు భరించాలి, ఆమెను బ్యాన్‌ చేద్దాం అంటూ నిర్మాతలు ఒక నిర్ణయానికి వచ్చారట.

ఈ విషయమై ప్రస్తుతం సినీ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది.విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం మలయాళ నిర్మాతలు త్వరలోనే అధికారికంగా నిత్యామీనన్‌పై బ్యాన్‌ విధించే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఈ సమయంలో నష్టనివారణ చర్యలు చేపట్టిన ముద్దుగుమ్మ నిత్యామీనన్‌ మీడియాతో మాట్లాడుతూ తాను ఎలాంటి తప్పు చేయలేదు, మా అమ్మ తీవ్ర అనారోగ్య పరిస్థితిలో ఉంది.ఆమె అలాంటి పరిస్థితిలో ఉండగా నిర్మాతలతో నేను ఏడుస్తూ మాట్లాడాలా, వారు నా పరిస్థితి అర్థం చేసుకోకుండా బ్యాన్‌ చేస్తాము అంటే నేను చేసేది ఏమీ లేదు.

నేను ఎలాంటి విషయాలను పట్టించుకోకుండా నా పని నేను చేసుకుంటూ వెళ్తాను, నా గురించి అందరికి తెలుసు, ఆ కొందరు నన్ను విమర్శిస్తే నేనేం పట్టించుకోను అంటూ నిత్యామీనన్‌ చెప్పుకొచ్చింది.నిత్యామీనన్‌ విరణతో నిర్మాతలు ఏమైనా కూల్‌ అవుతారో చూడాలి.

భర్తతో దిగిన ఫోటోలను డిలీట్ చేయాలని కోరిన కత్రినా కైఫ్.. అసలేం జరిగిందంటే?
Advertisement

తాజా వార్తలు