ఇండియన్ వైడ్ అత్యుత్తమ చిత్రంగా దృశ్యం 2... రికార్డు స్థాయిలో రేటింగ్

మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఈ మధ్యకాలంలో ఎక్కువగా డిఫరెంట్ కంటెంట్ కథలకు ప్రాధాన్యం ఇస్తూ సినిమాలు చేస్తున్నారు.

ఓవైపు కమర్షియల్ సినిమాలు చేస్తూనే మరోవైపు ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ లతో కొత్త దర్శకులతో సినిమాలు చేయడానికి ముందుకు వస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే మోహన్ లాల్ వరుస సక్సెస్ లు అందుకుంటున్నారు.మోహన్ లాల్ హీరోగా జీతు జోసెఫ్ దర్శకత్వంలో ఏడేళ్ల క్రితం దృశ్యం మూవీ వచ్చిన సంగతి తెలిసిందే.

ఈ మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే.దృశ్యం మూవీ సుమారు ఇండియన్ భాషలన్నిటిలో కూడా రీమేక్ అయింది.

అలాగే చైనా భాషలో కూడా రీమేక్ అయిన సౌత్ మూవీ గా రికార్డ్ క్రియేట్ చేసింది.ఇదిలా ఉంటే దృశ్యంకి సీక్వెల్ గా జీతు జోసెఫ్ గతేడాది మరో మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.

Advertisement

దృశ్యం 2 టైటిల్ తో తెరకెక్కిన ఈ మూవీ డైరెక్ట్ అమెజాన్ ప్రైమ్ లో లో రిలీజ్ అయ్యింది.మొదటి రోజు నుంచి మూవీకి పాజిటివ్ టాక్ రావడంతో మొదటి సినిమా కంటే భారీ హిట్ సొంతం చేసుకుంది.

అలాగే విమర్శకుల ప్రశంసలు కూడా దక్కించుకుంది.ఈ మూవీని దర్శకుడు కేవలం 40 రోజుల కంప్లీట్ చేసి మూడు నెలల్లోనే రిలీజ్ చేయడం విశేషం.

ప్రస్తుతం జీతు జోసెఫ్ దర్శకత్వంలో తెలుగులో ఈ మూవీ వెంకటేష్ హీరోగా రీమేక్ అవుతుంది.తెలుగు రీమేక్ మూవీ షూటింగ్ కూడా ఇప్పటికే కంప్లీట్ అయిపోయింది.

ఇదిలా ఉంటే మలయాళీ దృశ్యం 2 ఇప్పుడు అరుదైన ఫీట్ సొంతం చేసుకుంది.ఐఎండీబీలో హాలీవుడ్ నుంచి ఇండియన్ మూవీ ల వరకు అన్ని భాషా చిత్రాలకు రేటింగ్స్ ఇస్తూ ఉంటారు ఇందులో సినిమాలకు నెటిజన్లు నేరుగా రేటింగ్ ఇచ్చే అవకాశం ఉంటుంది.

పోలింగ్ ఏజెంట్ల నియామకంపై ఈసీ ఆదేశాలు
తల్లికి 15 లక్షల విలువ చేసే జ్యూవెలరీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్.. ఈ కొడుకు గ్రేట్ అంటూ?

ప్రపంచవ్యాప్తంగా బెస్ట్ సినిమాలు అందులో రేటింగ్స్ ఆధారంగానే నిర్వహిస్తుంటారు.ఇప్పటివరకు ఇండియన్ భాషల్లో విడుదలైన అన్ని చిత్రాలకు హైయెస్ట్ రేటింగ్ 8.5 వరకే వచ్చింది.అయితే దృశ్యం 2 ఈ రికార్డును బ్రేక్ చేసింది.ఏకంగా 8.8 రేటింగ్ ఈ మూవీ సొంతం చేసుకుంది.దీంతో దేశంలోనే అత్యుత్తమ చిత్రంగా దృశ్యం 2 నిలిచిందని చెప్పాలి.

Advertisement

తాజా వార్తలు