నరసరావుపేటను జిల్లాగా ప్రకటించిన సందర్భంగా రేపు ముఖ్యమంత్రి సంగీభావ పాదయాత్ర.. ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి

నరసరావుపేట జిల్లా ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడుతూ గుంటూరు జిల్లా నరసరావుపేట సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ ఆంశం.

నరసరావుపేట ప్రాంతాన్ని జిల్లాగా ప్రకటించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి నా కృతజ్ఞతలు.

ఈ ప్రాంతం ఎంతో మంది మహానుభావులందరికి స్థానం కల్పించింది.నరసరావుపేట ప్రాంతం ప్రజలు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఈ ప్రాంతం లో జిల్లా స్థాయి సంస్థల, ప్రభుత్వ స్థలాలు, అధికారిక నివాసాలకు అవసరం అయిన స్థలాలు ఇక్కడ ఉన్నాయి,ముఖ్యమంత్రి గారికి నాతో ఉన్న సన్నిహిత బంధం వల్ల అనేక సార్లు నరసరావుపేటను జిల్లా గా ప్రకటించాలి అని కొరాను.అన్ని పార్టీల మధ్య సమన్వయంతో నరసరావుపేట జిల్లా గా సాధించుకున్నాము.

ఈ అంశం మాత్రం చరిత్రలో నిలిచి పోయే అంశం.జిల్లా ప్రకటించిన సందర్భంగా రేపు నరసరావుపేట నుండి కోటప్పకొండ కు ముఖ్యమంత్రి సంగిభావ పాదయాత్ర చేస్తున్నాము.

Advertisement

ఈ యాత్రలో అందరూ పాల్గొని జయప్రదం చెయ్యాలి అని కోరుతున్నాను.రేపు 9 గంటలకు ఈ పాదయాత్ర ప్రారంభం అవుతుంది.

ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?
Advertisement

తాజా వార్తలు