సంచలనం సృష్టించిన..మిస్టర్ దళిత్ వెనుక ఎవరున్నారో తెలుసా

సోషల్ మీడియాలో సంచలన రేకెత్తించిన అంశం “ మిస్టర్ దళిత్ “ ఒక్క ఫోటో.దానిలో మెలితిప్పిన మీసం.

ఇది ఒక ఉద్యమంలా సాగిపోయింది.అందరి దళిత్ ని సపోర్ట్ చేసే చాలా మంది ప్రొఫైల్ పిక్స్ ఈ ఫోటో లతో నిండి పోయాయి.

ఏమి జరుగుతోంది.అసలు ఎవరు దళిత్ అనేది పెద్ద టాపిక్ అయ్యింది.

అందరూ దీనికి ఏమిటి కారణం అని ఊహిస్తున్న తరుణంలో ఈ ఉదంతానికి కారణమైన ఒక వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించారు.అతను చెప్పే విషయాలు విని పోలేసులు షాక్ కి గురయ్యారు .అసలు విషయాలలోకి వెళ్తే.సంచలనం సృశించిన ఈ విషయంలో అసలు సూత్రధారి గాంధీ నగర్ కు చెందిన దిగంత్ మహేరియా.

Advertisement

సోషల్ మీడియా.వాట్సప్ ఇలా ఎక్కడ చూసినా చాలా మంది ఈ మీసం మేలిసిఉన్న ఫోటోని ప్రొఫైల్ ఫోటో గా పెట్టుకోవడం తో ఈ ఫోటో వార్తల్లో ఒక అంశం అయ్యింది.

అసలు ఈ మీసం ఫోటో కి .దిగంత్ మహేరియా కి సంభందం ఏమిటి ఎవరు ఇతను.అసలు ఏమి జరిగింది.

ఈ ఫోటోలు ఇలా ఎందుకు హల్చల్ చేస్తున్నాయి.అనే వివరాలలోకి వెళ్తే.17 ఏళ్ల దిగంత్ మహేరియా అనే యువకుడు గాంధీనగర్ కు చెందిన వ్యక్తి.మీడియా దృష్టిని ఆకర్షించేందుకు వీలుగా సదరు యువకుడు దారుణమైన నాటకాన్ని ఆడినట్లుగా పోలీసులు గుర్తించారు.

పోలీసు అధికారుల చెప్పిన వివరాల ప్రకారం.తన స్కూల్ ఫ్రెండ్స్ ను తనపై దాడి చేయాలని దిగంత్ కోరినట్లుగా వెల్లడించారు.

పోలింగ్ ఏజెంట్ల నియామకంపై ఈసీ ఆదేశాలు
వైరల్ వీడియో : క్యాబ్ డ్రైవర్ తో హీరో గొడవ..

మొదట ఇనుప రాడ్ తో తనను కొట్టాలని దిగంత్ చెప్పాడని.ఆ తర్వాత దాన్ని బ్లేడ్ కు మార్చినట్లుగా తెలుస్తోంది.

Advertisement

దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో భారీ ప్రచారం జరిగింది.ఇదంతా మీడియా దృష్టిని ఆకర్షిందుకే అలా చేసినట్టు చెప్పారు.

ఫోరెన్సిక్ బృందం రంగంలోకి దిగి ఘటన స్థలంలో చూడగా అక్కడ అటువంటి అనుమానకర అంశాలు వాళ్ళు గుర్తించలేదు.కనీసం ఒక రక్తపు మారక కూడా లేదు.

ఈ విషయాలే పోలీసుల అనుమానాలకి తావిచ్చింది.ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న పోలీసులు రంగప్రవేశం చేసి విచారించగా అనేక విషయాలు వెల్లడయ్యాయి.

అంతేకాదు ఈ విషయంలో దిగంత్ పేరెంట్స్ పాత్రపై కూడా అనుమానాలని పోలీసులు వ్యక్త పరిచారు.నిజానికి అతనిమీద ఎటువంటి దాడి జరగలేదు అని తెలిపారు.

సోషల్ మీడియా లో వచ్చే వార్తలని గుడ్డిగా నమ్మటం ప్రమాదకరం అని ఏది వాస్తవమో కాదో తెలుసుకుని ప్రవర్తిస్తే శాంతి భద్రతలకి ముప్పు ఉండదు అని పోలీసులు తెలిపారు .

తాజా వార్తలు