టీడీపీ నేతలపై మంత్రి దాడిశెట్టి రాజా మండిపాటు

టీడీపీ అధినేత చంద్రబాబు, నాయకుడు యనమలపై మంత్రి దాడిశెట్టి రాజా మండిపడ్డారు.జగనన్నే మా భవిష్యత్ కార్యక్రమానికి ప్రజల నుంచి స్పందన వస్తుందని తెలిపారు.

గుడివాడ సభలో చంద్రబాబు ఖాళీ కుర్చీలకు ఉపన్యాసం ఇచ్చారని మంత్రి విమర్శించారు.మతాలు, కులాల మధ్య గొడవ సృష్టించడానికి యత్నిస్తున్నారని ఆరోపించారు.

ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచిన వ్యక్తి యనమల రామకృష్ణుడన్న ఆయన ఇప్పుడు తునిలో కులాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మనుషులను అంచనా వేయడంలోనూ వేణుస్వామి తోపు.. బిగ్‌బాస్ నెక్స్ట్ సీజన్ గెలిచేస్తారా..? 
Advertisement

తాజా వార్తలు