శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి:ఈ రోజు గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రివర్యులు శ్రీమతి ఆర్.కె.
రోజా గారు శ్రీ అమ్మవారి దర్శనార్థము ఆలయమునకు విచ్చేయగా ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి శ్రీఅమ్మవారి దర్శనం కల్పించారు.
ఈరోజు గాజుల అలంకరణ మహోత్సవ విశేషములను గౌరవ మంత్రివర్యుల వారికి ఆలయ అధికారులు వివరించారు.
అనంతరం ఆలయ ప్రధానార్చకులు వీరికి వేదాశీర్వచనం చేసి శ్రీ అమ్మవారి ప్రసాదము, శేషవస్త్రం అందజేశారు.







