చిత్తూరు నగరంలోని వేలూరు రోడ్డు చామంతి పురం లో నూతనంగా ఏర్పాటు చేసిన లలిత జ్యువలరీ షోరూంను క్రీడా శాఖ మంత్రి రోజా బుధవారం ఉదయం ప్రారంభించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ లలిత జ్యువలరీ తో తనకు ఉన్న అనుబంధం మరువలేనిదని పేర్కొన్నారు.
తను సినీ రంగంలో ఉన్నప్పుడే చెన్నైలో ఉన్న లలిత జ్యువెలరీ లోనే నగలు కొనుగోలు చేసే వారిని, అధినేత కిరణ్ కుమార్ అతి తక్కువ ధరలకు నాణ్యమైన నగలను అందించే వారిని తెలిపారు.
గత 25 సంవత్సరాలుగా లలిత జ్యువలరీ తో తనకున్న అనుబంధం తో షోరూం ప్రారంభానికి వచ్చినట్లు వెల్లడించారు.జ్యువలరీ అధినేత కిరణ్ కుమార్ ను గ్రీన్ అంబాసిడర్ గా రోజాను నియమిస్తారా అని విలేకరులు అడిగిన ప్రశ్నకు రోజా స్పందిస్తూ కిరణ్ కుమార్ ఒక అంబాసిడర్ అని ప్రజల మధ్య అతనికి ఉన్న క్రేజ్ తో లలిత జ్యువెలర్స్ ఫేమస్ అయింది అన్నారు.అనంతరం లలిత జ్యువెలరీ అధినేత కిరణ్ కుమార్ మాట్లాడుతూ సోదరి సమానురాలైన రోజాతో తనకున్న అనుబంధం గొప్పదని, పిలవగానే ప్రారంభానికి వచ్చిన రోజాకు కృతజ్ఞతలు తెలిపారు.