ఎన్టీఆర్ వంటి చేతగాని ముఖ్యమంత్రి దేశంలో ఎక్కడ లేడని రాష్ట్ర ఆర్ అండ్ బి.మంత్రి దాడిశెట్టి రాజా సంచలన వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్రం మొత్తం తన గుప్పెట్లో ఉండగా రెండుసార్లు వెన్నుపోటు పొడిపించుకున్నాడని వ్యాఖ్యానించారు.ఎన్టీఆర్ కి, వైఎస్ ఆర్ కి పోలిక లేదని దాడిశెట్టి రాజా ఆరోపించారు.
మంత్రి దాడిశెట్టి రాజా మీడియాతో మాట్లాడుతూ.నాడు నాదెండ్ల మొన్న చంద్రబాబు ఇద్దరు ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచారని విమర్శించారు.అందుకే నేను ఎన్టీఆర్ ని చేతకాని వాడు అంటున్నానని అన్నారు.అమరావతి మేళాలు ఏం చేస్తున్న ప్రజలు సమన్వయంతో ఉన్నారని అన్నారు.