ఎన్నో రోజులుగా మెగా ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న సినిమా వాల్తేరు వీరయ్య.ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 13న ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది.
రొటీన్ కమర్షియల్ సినిమా అయినా కూడా మెగా ఫ్యాన్స్ ను మెప్పించే అన్ని ఎలిమెంట్స్ తో డైరెక్టర్ బాబీ ఈ సినిమాను తెరకెక్కించాడు.చిరంజీవి మాస్ మహారాజా రవితేజ కలిసి నటించిన మల్టీ స్టారర్ సినిమా ప్రేక్షకులను మెప్పించి కోట్ల రూపాయలను వసూలు చేస్తుంది.
సంక్రాంతి సీజన్ లో వచ్చిన అన్ని సినిమాల కంటే ఈ సినిమా ఎక్కువ కలెక్షన్స్ రాబడుతుంది.సంక్రాంతి మొనగాడు అనిపించుకున్న మెగాస్టార్ తన నెక్స్ట్ రాబోతున్న భోళా శంకర్ సినిమా గురించి అప్డేట్ ఇచ్చారు.
మెగాస్టార్ నటిస్తున్న భోళా శంకర్ ఈ సమ్మర్ లో విడుదల అవుతుంది అని అంతా అనుకున్నారు.కానీ చిరు వాల్తేరు ప్రమోషన్స్ లో ఈ సినిమా సమ్మర్ లో వచ్చే అవకాశం లేదని తేల్చి చెప్పేసాడు.
కానీ ఇప్పుడు వాల్తేరు వీరయ్య ఇచ్చిన బూస్ట్ తో నిర్ణయం మార్చుకున్నారట.ఈ సినిమా విడుదల అయ్యి ఇప్పటికి హౌస్ ఫుల్స్ అవుతూ కోట్లు రాబడుతున్న నేపథ్యంలో భోళా శంకర్ విషయంలో చిరు నిర్ణయం మార్చుకున్నట్టు టాక్ వస్తుంది.ఈ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేసి సమ్మర్ లోనే రిలీజ్ చేయాలని మేకర్స్ బావిస్తుండడంతో ప్రెజెంట్ శరవేగంగా షూట్ జరుగుతుందట.
ఈ సినిమా కోసం హైదరాబాద్ లో కలకత్తా సెట్ ను కూడా రెడీ చేసారని ఇందులోనే షూట్ జరుగుతుందని తెలుస్తుంది.వాల్తేరు వచ్చి వారం కాకుండానే భోళా సెట్ లో చిరు పాల్గొనడం వల్ల ఈ సినిమాను ఎంత ఫాస్ట్ గా పూర్తి చేయాలని పట్టుదలగా ఉన్నారో అర్ధం అవుతుంది.తమిళ్ మూవీ వేదాళం సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను మెహర్ రమేష్ డైరెక్ట్ చేస్తున్నాడు.
ఇక ఈ సినిమాలో తమన్నా భాటియా హీరోయిన్ గా నటిస్తుండగా మణిశర్మ తనయుడు మహతి స్వరసాగర్ సంగీతం అందిస్తున్నాడు.అలాగే ఇందులో చిరు చెల్లెలుగా కీర్తి సురేష్ నటిస్తుంది.
ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర ఈ సినిమాను గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.