మంచు విష్ణు రిస్క్‌ ఖరీదు ఎంతో తెలుసా?

మోసగాళ్లు సినిమా కథను నాన్న మోహన్‌ బాబు వద్ద చెప్పిన సమయంలో ఆయన కథ చాలా అద్బుతంగా ఉందని అభినందించాడు.

కాని బడ్జెట్‌ విషయంలో మాత్రం అంత రిస్క్ అవసరమా అంటూ హెచ్చరించాడు అంటూ సినిమా ప్రమోషన్‌ సమయంలో మంచు విష్ణు చెప్పుకొచ్చిన విషయం తెల్సిందే.

ఆ సమయంలో నేను మౌనంగా ఉండి తాను అనుకున్నట్లుగా సినిమాను భారీ మొత్తంతో నిర్మించాను అంటూ మంచు విష్ణు అన్నాడు.నాన్న గారు గతంలో ఎన్నో రిస్క్‌ లు చేశారు.

ఆ రిస్క్ ల ముందు ఇదో చిన్న రిస్క్‌ అంతే కదా అన్నట్లుగా తాను భావించాను.రిస్క్‌ చేయకుండా ఉండటమే జీవితంలో అతి పెద్ద రిస్క్ అంటూ కొత్త వేదాంతంను చెప్పిన మంచు విష్ణు మోసగాళ్లు సినిమా ను రూ.51 కోట్లతో నిర్మించాడు.ఇప్పుడు ఆ సినిమా తీవ్రంగా నిరాశ పర్చిన నేపథ్యంలో ఆయన కు వచ్చిన నష్టం ఎంత అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు లెక్కలు వేస్తున్నారు.

 మోసగాళ్లు సినిమా కు కనీసం కోటి రూపాయల షేర్‌ కూడా రాలేదు.ఇండస్ట్రీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం కేవలం రూ.70 లక్షలు మాత్రమే వసూళ్లు అయ్యిందట.రూ.51 కోట్లతో నిర్మించిన మోసగాళ్లు సినిమా ను విడుదలకు ముందే నాన్‌ థియేట్రికల్‌ రైట్స్ ద్వారా 12 కోట్లకు అమ్మేయడం జరిగింది.ఇక థియేట్రికల్‌ రైట్స్ ను సినిమా పై పెద్దగా అంచనాలు లేని కారణంగా 7 నుండి 10 కోట్లకు అమ్మేసినట్లుగా తెలుస్తోంది.

Advertisement

అంటే సినిమా విడుదలకు ముందు విష్ణుకు దాదాపుగా 20 కోట్ల వరకు వచ్చి ఉంటాయి అనేది ఒక అంచనా.సినిమా తీవ్రంగా నిరాశ పర్చిన కారణంగా బయ్యర్లకు కొంత మొత్తంలో వెనక్కు ఇవ్వాల్సి రావచ్చు అంటున్నారు.దాదాపుగా రూ.5 కోట్లు వెనక్కు వెళ్లి పోయినా మిగిలిన 15 కోట్లు మంచు విష్ణు వద్ద ఉంటాయి.అంటే మొత్తం 51 కోట్ల నుండి మంచు విష్ణుకు వచ్చింది 15 కోట్లు అంటూ సమాచారం అందుతోంది.

అంటే మోసగాళ్ల వల్ల నష్టపోయిన మొత్తం దాదాపుగా 35 కోట్ల కు పై మాటే అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు