అదృష్టం రావాలని ఓ వ్యక్తి ఏకంగా విమానాన్ని ఏం చేసాడో తెలిస్తే?

మనిషి ఆశాజీవి.ఎంత మనకు వచ్చినా ఇంకొంత రావాలని ఆశించే పరిస్థితి ఉంటుంది.

ఇక నాకు లాటరీ తగలాలి, ఒక్క దెబ్బకు కోటేశ్వరుడిని అయిపోవాలి.అదృష్టం నా వెంబడి ఉండాలి.

ఇలాంటి కోరికలు బోలెడన్ని మన మదిలో మెదులుతాయి.ఇక మూఢ నమ్మకాలతో ఏదేదో చేస్తుంటారు.

గంగాజలాలలో కాయిన్స్ వేస్తే డబ్బులు బాగా వస్తాయని, అదృష్టం వరిస్తుందని, కొంత మంది లంకె బిందెలు దొరుకుతాయని చెప్పి ఏవేవో పూజలు చేస్తుంటారు.అచ్చం ఇలాగే అదృష్టం వరించాలని చెప్పి చేసిన ఓ పనికి అతనికి భారీ జరిమానా విధించాడు.

Advertisement

విమానంలో ఎక్కిన ఆ యువకుడు కొన్ని కాయిన్స్ ను ఎర్రటి పేపర్ లో చుట్టి అదృష్టం వరిస్తుందని చెప్పి విమానం ఇంజన్ లో పడేసాడు.కాని అవి ఇంజన్ లో పడకుండా క్రింద పడ్డాయి.

ఇంకేముంది ఎయిర్ పోర్ట్ సిబ్బంది, పోలీసులు అప్రమత్తమై ఇంజన్ లో నుండి ఏదైనా పడిందో ఏమో నని విమానాన్ని అత్యవసర ల్యాండింగ్ చేసారు.  భద్రతా లోపం ఏదైనా అయి ఉండవచ్చని చెప్పి 148 మంది ప్రయాణిస్తున్న ఆ విమానాన్ని రద్దు చేశారు.

ఇక ఎవరు చేశారో కనుక్కొని ఈ యువకుడికి  పన్నెండు లక్షల 36 వేల రూపాయల జరిమానా వేశారు.ఇదేం పిచ్చి పని నాయనా అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

పోలియోతో రెండు కాళ్లు పడిపోయినా రోజుకు 16 గంటల పని.. వైతీశ్వరన్ సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!
Advertisement

తాజా వార్తలు