పోలీసు పెళ్ళాం తో అక్రమ సంబంధం

ప్రకాశం జిల్లా చీరాల బస్టాండ్ ప్రాంగణంలో నిలిచి ఉన్న ఓ బస్సులో ప్రయాణీకులు చూస్తుండగానే దారుణహత్య జరిగింది.

ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన ఓ పోలీస్ ఉన్మాదిలా మారి కత్తితో ఓ వ్యక్తి గొంతు కోశాడు.

అందరూ చూస్తుండగానే ఒక్కసారిగా ఈ సంఘటన జరగడంతో ప్రయాణికులను భయభ్రంతులకు గురిచేసింది.తీవ్రగాయాలపాలైన సునీల్ కుమార్ ను 108లో ఆస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందాడు.

బస్సులో జరిగిన కత్తి దాడిలో మృతిచెందిన సునీల్ కుమార్ చీరాల ఎల్ఐసీ ఆఫీసులో అసిస్టెంట్ మేనేజర్.వివాహేతర సంబంధం నేపథ్యంలో హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసరావు ఈ హత్య చేశాడు.

కారంచేడు పోలీస్ స్టేషన్ లో హెడ్ కానిస్టేబుల్ గ పనిచేస్తున్న శ్రీనివాసరావు తన భార్యతో సునీల్ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని ఆరోపిస్తున్నాడు.దీనిపై ప్రశ్నించగా తనపై కత్తితో దాడి చేశాడని, ఆ సమయంలో అతని చేతిలోంచి కత్తి లాక్కుని దాడి చేశానని చెబుతున్నాడు నిందితుడు.

Advertisement
వైరల్ వీడియో : క్యాబ్ డ్రైవర్ తో హీరో గొడవ..

తాజా వార్తలు