బాపట్ల జిల్లా అమర్తలూరు పోలీస్ స్టేషన్ లో ఓ వ్యక్తి వీరంగం సృష్టించాడు.చోరీ అయిన బైకుపై తిరుగుతున్న వ్యక్తిని పట్టుకున్న స్థానికులు పోలీసులకు అప్పగించారు.
ఈ క్రమంలో నిందితుడిని స్టేషన్ లో పోలీసులు విచారిస్తున్నారు.అదే సమయంలో పీఎస్ కు నిందితుడి అన్న రావడంతో ఇద్దరు కలిసి వీరంగం సృష్టించారు.
ఈ నేపథ్యంలోనే పోలీస్ స్టేషన్ అద్దాలను ధ్వంసం చేశారు.మహిళా పోలీసులపై అటాక్ చేసిన దుండగులు దురుసుగా ప్రవర్తించారు.
దీంతో నిందితులపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.