మెగా ఫ్యామిలి నుండి హీరోగా ఎంట్రీ ఇచ్చిన వారిలో మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ( Sai Dharam Teja ) ఒకరు.ఈయన మొదటి సినిమాతోనే ఆకట్టుకుని తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.
సుప్రీం సినిమాతో నటన పరంగా కూడా ఆకట్టుకుని మరింత ఫాలోయింగ్ పెంచుకున్నాడు.అయితే ఈ రేంజ్ హిట్ ను సాయి తేజ్ ఆ తర్వాత అందుకోలేక పోయాడు.
వరుసగా ప్లాప్స్ వస్తున్నా ఎలాంటి సంబంధం లేకుండా సినిమాలు చేస్తూ పోతున్న సాయి ధరమ్ తేజ్ లాంగ్ గ్యాప్ తీసుకుని నటించిన సినిమా ”విరూపాక్ష” ( Virupaksha ).ఈ సినిమా నేచురల్ థ్రిల్లర్ గా మేకర్స్ తెరకెక్కించారు.మరి ఈ సినిమాలో సాయి తేజ్ కు జోడీగా సంయుక్త మీనన్( Sanyukta Menon ) హీరోయిన్ గా నటించింది.సుకుమార్ శిష్యుడు కార్తీక్ దండు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను డైరెక్టర్ సుకుమార్, బివిఎస్ఎన్ ప్రసాద్ సంయుక్తంగా నిర్మించారు.
ఇది సాయి తేజ్ మొదటి పాన్ ఇండియన్ మూవీ కావడంతో అంచనాలు భారీగా క్రియేట్ అయ్యాయి.ఇక ఏప్రిల్ 21న ఈ సినిమా గ్రాండ్ గా పాన్ ఇండియా వ్యాప్తంగా రిలీజ్ కానుంది.మరి రిలీజ్ డేట్ దగ్గర పడడంతో మేకర్స్ ప్రమోషన్స్ స్టార్ట్ చేసారు.ఈ మధ్యనే ఈ సినిమా టీజర్ తో ఆకట్టుకుని మరిన్నీ అంచనాలు పెంచుకున్నారు.మరి ఈ రోజు ఏప్రిల్ 1 కావటంతో ప్రమోషన్స్ స్టార్ట్ చేసారు.
ఈ రోజు నుండి ఏప్రిల్ 21 వరకు ప్రమోషన్స్ ఉంటాయని సోషల్ మీడియా వేదికగా తేలింది.ఇప్పటికే దసరా సినిమాతో సుకుమార్ శిష్యుడు శ్రీకాంత్ ఓదెల సూపర్ హిట్ అందుకున్నాడు.ఇక ఇప్పుడు సుకుమార్ మరో అసిస్టెంట్ సాయి తేజ్ కు మంచి హిట్ ఇస్తాడో లేదో చుడాలి.
ఈ సినిమాకు కూడా ప్రమోషన్స్ గ్రాండ్ లెవల్ లో ఉండబోతున్నాయని తెలుస్తుంది.మొత్తానికి సుకుమార్ శిష్యులు టాలీవుడ్ ను ఏలుతున్నారు అనే చెప్పాలి.