కృష్ణ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం... ఆరుగురు మృతి

ప్రయాణంలో అతివేగం, నిర్లక్ష్యం ఎలాంటి ప్రమాదాలు తీసుకొస్తుందో చాలా సందర్భాలలో రుజువు అవుతూనే ఉంది.

అయినా కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ చేసిన తప్పులనే పదే పదే చేస్తున్నారు.

సామర్ధ్యానికి మించి ప్రయానికులని ఎక్కించుకోవడం కూడా ఒక్కోసారి ప్రమాద తీవ్రత పెరగడానికి కారణం అవుతుంది.గ్రామీణ ప్రాంతాలలో పోలీసులు చర్యలు అంతగా ఉండకపోవడం వలన ఆటో డ్రైవర్ లు సామర్ధ్యానికి మించి ప్రయానికులని ఎక్కించుకుంటారు.

ఇలాంటి సమయాలలో ఏ మాత్రం నిర్లక్ష్యంగా, అతివేగంగా ఆటోని నడిపిన ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది.తాజాగా కృష్ణ జిల్లా నూజివీడు సమీపంలో అలాంటి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.

ఈ ప్రమాదంల ఆరుగురు స్పాట్ లోనే చనిపోయారు.తొమ్మిది మంది గాయపడగా వారిని సమీపంలో హాస్పిటల్ కి తరలించారు.

Advertisement

నూజివీడు మండలంలోని గొల్లపల్లికి దగ్గర్లో ఆటో రోడ్డుపై వెళ్తుండగా ఓ మలుపు లాంటి చోట లారీ వేగంగా వచ్చింది డ్రైవర్ కంట్రోల్ తప్పడంతో లారీ ఆటోవైపు దూసుకొచ్చి బలంగా ఢీకొట్టినట్లు తెలిసింది.ఈ ప్రమాదంలో ఆటో తుక్కుతుక్కైంది.

ఈ ప్రమాద సమయంలో ఆటోలో సామర్ధ్యానికి మించి ఎక్కువ మంది ఉండటంతో ఆరుగురు ప్రమాధస్థలంలోనే చనిపోయారు.లారీ డ్రైవర్ అతివేగం, నిర్లక్ష్యం, ఆటోలో సామర్ధ్యానికి మించి ప్రయానికులని ఎక్కించడం ప్రమాద తీవ్రత పెరగడానికి కారణంగా ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.

డ్రైవర్ నిద్రమత్తులో ఉన్నాడా అనే కోణంలో కూడా విచారణ చేస్తున్నారు.ఈ ప్రమాదంలో చనిపోయిన వారు అందరూ రోజువారి కూలీలే అని తెలుస్తుంది.

మృతులంతా నూజివీడు మండలం లయన్ తండా వాసులుగా పోలీసులు చెబుతున్నారు.

వీడియో వైరల్ : శోభనం గదిలో ఆలియా, రణ్ వీర్.. ఇదే తొలిసారి అంటూ..

Advertisement

తాజా వార్తలు