యాత్ర దర్శకుడుతో మల్టీ స్టారర్ కథకి ఒకే చెప్పిన నితిన్

ఆనందోబ్రహ్మ సినిమాతో దర్శకుడుగా కెరియర్ స్టార్ట్ చేసి హిట్ కొట్టిన టాలెంటెడ్ స్టార్ మహి వి రాఘవ.

అతని రెండో సినిమాగా వైఎస్ఆర్ జీవితంలో అతను ముఖ్యమంత్రి కావడానికి కారణం అయిన కీలకఘట్టం పాదయాత్ర నేపధ్యంలో యాత్ర టైటిల్ తో తెరకెక్కించారు.

మలయాళీ స్టార్ మమ్ముట్టి ఈ సినిమాలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాత్రలో కనిపించారు.ఈ సినిమా కూడా హిట్ టాక్ తెచ్చుకొని మహికి దర్శకుడుగా మంచి మైలేజ్ తీసుకొచ్చింది.

అలాగే ఈ సినిమా వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావడానికి పొలిటికల్ గా ఉపయోగపడింది అనే టాక్ ఉంది.దీని తర్వాత మహి వి రాఘవన్ జగన్ పాదయాత్ర నేపధ్యంలో యాత్ర 2 చేస్తానని ప్రకటించాడు.

మరి ఎందుకనో ఆ సినిమా కార్యరూపం దాల్చలేదు.తరువాత అల్లు అర్జున్ సినిమా సినిమా చేసే అవకాశం సొంతం చేసుకున్నాడని ప్రచారం నడిచింది.

Advertisement

తరువాత చాలా మంది హీరోల పేర్లు వినిపించాయి.అయితే ఇప్పుడు మహి వి రాఘవ నెక్స్ట్ సినిమాకి సంబంధించి ఒక పక్కా సమాచారం బయటకొచ్చింది.

అతని నెక్స్ట్ సినిమాని యూత్ స్టార్ నితిన్ తో చేయబోతున్నాడని, ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ కన్ఫర్మ్ అయిపోయిందని సమాచారం.ఇందులో నితిన్ తో పాటు మరో హీరో కూడా నటించబోతున్నాడని సమాచారం.

ఇద్దరు అన్నదమ్ములైన పోలీస్ ఆఫీసర్స్ కథతో ఈ సినిమా ఉండబోతుందని టాక్ నడుస్తుంది.త్వరలో ఈ సినిమాకి సంబంధించి అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చే అవకాశం ఉన్నట్లు బోగట్టా.

ఇదిలా ఉంటే ప్రస్తుతం నితిన్ మేర్లపాక గాంధీ దర్శకత్వంలో మ్యాస్ట్రో సినిమా చేస్తున్నాడు.దీని తర్వాత మహి దర్శకత్వంలో సినిమా స్టార్ట్ చేసే అవకాశం ఉంది.

తల్లికి 15 లక్షల విలువ చేసే జ్యూవెలరీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్.. ఈ కొడుకు గ్రేట్ అంటూ?
Advertisement

తాజా వార్తలు