ఫ్రీగా ప్రమోషన్స్ చేస్తున్న మహేష్ బాబు.. కారణం అదే!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు.

ఈయన కేవలం వెండి తెరపై మాత్రమే కాకుండా సోషల్ మీడియాలో కూడా సూపర్ స్టార్ అని చెప్పవచ్చు.

మహేష్ బాబు సోషల్ మీడియా ఖాతాలను ఫేస్ బుక్, ట్విట్టర్, ఇంస్టాగ్రామ్ వంటి ఖాతాలలో మిలియన్ల సంఖ్యలో ఫాలోవర్స్ ఉన్న సంగతి మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే ఈయన సోషల్ మీడియా వేదికగా ఒక చిన్న పోస్ట్ చేసినా అతనికి లక్షల్లో సంపాదన వస్తుంది.

అయితే మహేష్ బాబు ఈ విధమైనటువంటి యాడ్స్ కి సంబంధించిన పోస్టులను సోషల్ మీడియాలో పోస్ట్ చేయకుండా కేవలం తనకు సంబంధించిన సినిమాలు తన కుటుంబం గురించి సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేస్తుంటారు.ఇకపోతే తన కుటుంబంలో ఉన్నటువంటి హీరోల సినిమాలను కూడా సోషల్ మీడియా వేదికగా మహేష్ బాబు ప్రమోట్ చేస్తూ ఉంటారు.

సాధారణంగా చాలా మంది హీరోలు ఇతర సినిమాలను ప్రమోట్ చేయడానికి ఇష్టపడరు.ఒకవేళ ఆ సినిమా కనుక బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను సందడి చేయలేకపోతే వారి ఇమేజ్ మొత్తం డ్యామేజ్ అవుతుందనే కారణంతో ఇతర హీరోలకు హీరోయిన్లకు సంబంధించిన సినిమాలను వారి సోషల్ మీడియా ద్వారా ప్రమోట్ చేయడానికి ఏమాత్రం ఇష్టపడరు.

Advertisement

ఒకవేళ ప్రమోట్ చేసినా అందుకుగాను డబ్బు తీసుకుంటారు.

కానీ మహేష్ బాబు ఏ విధమైనటువంటి డబ్బులు ఆశించకుండా తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా ఇతర హీరోలకు సంబంధించిన సినిమాలను ఫ్రీ గా ప్రమోట్ చేస్తున్నారు.అయితే వారితో ఉన్న స్నేహబంధం సాన్నిహిత్యం కారణంగానే మహేష్ బాబు ఈ విధమైనటువంటి ప్రమోషన్ కార్యక్రమాలను చేస్తున్నారని చెప్పవచ్చు.ఇకపోతే సర్కారు వారి పాట చిత్రంలో మహేష్ బాబు సరసన నటించిన కీర్తి సురేష్ సినిమాకు సంబంధించిన పోస్టర్ ను మహేష్ బాబు తన సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు.

ఈ విధంగా ఏ మాత్రం డబ్బులు తీసుకోకుండా ఫ్రీగా మహేష్ బాబు ప్రమోషన్ చేయడంతో ఈయనపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?
Advertisement

తాజా వార్తలు