టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన తాజా చిత్రం సరిలేరు నీకెవ్వరు సినిమా సంక్రాంతి పండగ కానుకగా జనవరి 11న రిలీజ్ చేశారు.ఈ సినిమాలో మహేష్ ఆర్మీ మేజర్ పాత్రలో నటిస్తాడనే విషయం తెలిసిన దగ్గర్నుండీ ఈ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.
ఇక ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి రీఎంట్రీ ఇస్తున్నారనే వార్తలో ఆ అంచనాలు కాస్త రెట్టింపు అయ్యాయి.
సినిమా రిలీజ్ అయ్యి మంచి టాక్ను సొంతం చేసుకుని కలెక్షన్ల వర్షం కురిపిస్తుండటంతో చిత్ర యూనిట్ శుక్రవారం హన్మకొండలో సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు.
కాగా ఈ చిత్ర నిర్మాత అయిన అనిల్ సుంకర ఈ సినిమా మొదటి వారంలోనే 100+ కోట్ల షేర్ కలెక్షన్లు రాబట్టిందంటూ చెప్పుకొచ్చాడు.ఇదే విషయంపై మహేష్ కూడా స్పందించారు.
సరిలేరు నీకెవ్వరు ఈ ఫీట్ సాధించడం చాలా సంతోషంగా ఉందని ఆయన అన్నారు.
దీంతో సినీ క్రిటిక్స్, ఎక్స్పర్ట్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సినిమా ఎంత కలెక్ట్ చేసిందో రోజూ అంచనాలు వేసే తమకు తెలియకుండా ఈ సినిమా వంద కోట్లు ఎప్పుడు కలెక్ట్ చేసిందంటూ ప్రశ్నిస్తున్నారు.ఈ సినిమా మొదటి వారం పూర్తయ్యే సరికి రూ.82 కోట్లు – రూ.84 కోట్ల మధ్య ఉంటుందని వారి లెక్కలు చెబుతున్నాయి.మరి ఇలాంటి ఫేక్ కలెక్షన్స్తో మహేష్ ఫ్యాన్స్కు ఎలాంటి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు అని సినీ క్రిటిక్స్ మండిపడుతున్నారు.