మహేష్‌, త్రివిక్రమ్‌ కొత్త సినిమాకు 'అతడు' తో లింక్‌

సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు ప్రస్తుతం పరశురామ్‌ దర్శకత్వం లో సర్కారు వారి పాట సినిమా చేస్తున్నాడు.సినిమా రెండవ షెడ్యూల్‌ ప్లాన్‌ చేసి షూటింగ్‌ ఆరంభించిన వెంటనే కరోనా సెకండ్‌ వేవ్‌ విజృంభించి కేసులు విపరీతంగా నమోదు అవుతున్న నేపథ్యంలో షూటింగ్ ఆపేశారు.

ఒక వైపు సర్కారు వారి పాట సినిమా సందడి చేస్తూనే మరో వైపు త్రివిక్రమ్‌ తో సినిమాను మహేష్ బాబు మొదలు పెట్టబోతున్నట్లుగా ప్రకటించాడు.11 ఏళ్ల తర్వాత మహేష్‌ బాబు మరియు త్రివిక్రమ్‌ ల కాంబోలో రాబోతున్న నేపథ్యంలో అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్న నేపథ్యంలో ఈ సినిమా కు ఏ టైటిల్‌ ను పెడతారు అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

మొన్నటి వరకు ఈ సినిమాకు అ అక్షరంతో ఆరంభం అయ్యే టైటిల్‌ ను అనుకుంటున్నట్లుగా వార్తలు వచ్చాయి.కాని తాజాగా ఈ సినిమా కు పార్ధు అనే టైటిల్‌ ను అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది.

మహేష్‌ బాబు.త్రివిక్రమ్ ల కాంబో లో వచ్చిన అతడు సినిమా ఎంతటి హిట్ ను దక్కించుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

మహేష్‌ బాబు పేరు అందులో పార్ధు మరియు నందు.పార్థు పేరు ఆ సమయంలో బాగా ట్రెండ్ అయ్యింది.

Advertisement

మహేష్ బాబును పార్ధుగా ఎంతో మంది అభిమానించారు.ఇప్పుడు కూడా మళ్లీ ఆయన్ను పార్థుగా సినిమా లో చూపించాలనే నిర్ణయానికి మహేష్‌ బాబు వచ్చాడనే వార్తలు వస్తున్నాయి.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం పార్థు అనేది వర్కింగ్‌ టైటిల్ అంటున్నారు.అయితే పార్ధు టైటిల్ నే ఖరారు చేసే అవకాశం లేక పోలేదు అంటున్నారు.

రెండు టైటిల్స్ ను మహేష్ బాబు కోసం త్రివిక్రమ్‌ ఖరారు చేయడం జరిగింది.చివరకు పార్థును ఫైనల్‌ చేశారని తెలుస్తోంది.

ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?
Advertisement

తాజా వార్తలు