భారీ అంచనాలతో బాలీవుడ్ సినిమా దగ్గర రాబోతున్న పాన్ ఇండియన్ సినిమాల్లో ”యానిమల్’‘( Animal Movie ) ఒకటి.టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ ( Sandeep Reddy Vanga ) తెరకెక్కించడం వల్ల ఈ సినిమాపై సౌత్ వారు కూడా ద్రుష్టి పెట్టారు.
ముఖ్యంగా తెలుగు ఆడియెన్స్ అయితే అంచనాలు పెంచేసుకున్నారు.బాలీవుడ్ యంగ్ హీరో రణబీర్ కపూర్( Ranbir Kapoor ) హీరోగా నేషనల్ క్రష్ రష్మిక మందన్న( Rashmika Mandanna ) హీరోయిన్ గా నటిస్తున్న ‘యానిమల్’ సినిమా నుండి వచ్చిన అన్ని ప్రచార చిత్రాలు ఈ సినిమాపై నెక్స్ట్ లెవల్లో అంచనాలు పెంచేసాయి.
టీజర్, సాంగ్స్, ఇటీవలే వచ్చిన ట్రైలర్ కూడా ఈ సినిమాపై అంచనాలను పీక్స్ కు చేర్చింది.
రిలీజ్ కు మరికొద్ది రోజులే ఉండడంతో ఈ సినిమా ప్రమోషన్స్ లో టీమ్ అంత బిజీ బిజీగా ఉన్నారు.ఇక తాజాగా తెలుగులో కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను మేకర్స్ గ్రాండ్ గా నిర్వహించేందుకు సిద్ధం అవుతున్నారు.ఈ క్రమంలోనే అఫిషియల్ గా అప్డేట్ ఇచ్చారు.
ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు గెస్టులను ప్రకటిస్తూ పోస్టర్ రిలీజ్ చేసారు.
ఈ వేడుకకు సూపర్ స్టార్ మహేష్ బాబుతో పాటు అగ్ర డైరెక్టర్ రాజమౌళి హాజరు కానున్నట్టు తెలుస్తుంది.గతంలో బ్రహ్మాస్త్ర సమయంలో రణబీర్ తో మంచి బంధం ఏర్పడగా అదే అనుబంధంతో ఇప్పుడు ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరుకానున్నట్టు తెలుస్తుంది.ఇక ఈ ఈవెంట్ ఈ రోజు మల్లారెడ్డి యూనివర్సిటీలో జరగనుంది.
కాగా డిసెంబర్ 1న గ్రాండ్ గా పాన్ ఇండియా రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకు హర్ష వర్ధన్ సంగీతం అందిస్తుండగా టి సిరీస్, భద్రకాళి పిక్చర్స్ వారు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.తెలుగులో ప్రముఖ నిర్మాత దిల్ రాజు( Dil Raju ) ఈ సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు.
మరి ఈ సినిమా తెలుగులో ఎలా ఆకట్టుకుంటుందో వేచి చూడాల్సిందే.