ప్రపంచంలో మొదటి సారి హెచ్‌ఐవీ పూర్తిగా నయం అయ్యింది... వైధ్యశాస్త్రంలో మరో అద్బుతం ఆవిష్కారం

ప్రపంచంలో అతి భయంకరమైన వ్యాధులు కొన్ని ఉన్నాయి.ఆ వ్యాధులు ఒకసారి ఎటాక్‌ అయ్యాయి అంటే మనిషిని చంపే వరకు వదలవు.

అందులో ఒకటి ఎయిడ్స్‌.ఇది ఎక్కువగా శృంగారం వల్ల వస్తుందనే విషయం తెల్సిందే.

ఎయిడ్స్‌ ఉన్న వ్యక్తితో శృంగారంలో పాల్గొనడం లేదా ఎయిడ్స్‌ ఉన్న వ్యక్తి రక్తంను ఎక్కించుకోవడం వల్ల ఎయిడ్స్‌ వ్యాది అనేది సంక్రమిస్తుంది.ఎయిడ్స్‌ వ్యాదికి ఎన్నో సంవత్సరాలుగా మందు కనిపెట్టలేక శాస్త్రవేత్తలు తలలు పట్టుకుంటున్నారు.

ఎయిడ్స్‌ వ్యాదికి మందు అంటూ రకరకాల ప్రచారాలు జరుగుతున్నా ఇప్పటి వరకు ఎయిడ్స్‌ వచ్చిన వ్యక్తికి పూర్తిగా నయం అయిన దాఖలాలు అయితే లేవు.సుదీర్ఘ ప్రయత్నాలు మరియు పరిశోధనల తర్వాత ఎయిడ్స్‌కు మందు కాదు కాని ఒక ప్రత్యామ్నాయ మార్గంను, దాని నుండి తప్పించుకునే ఒక దారిని శాస్త్రవేత్తలు కనిపెట్టడం జరిగింది.1990 నుండి చేస్తున్న విశేష పరిశోధనలకు ఒక చిన్న మార్గం అనేది దొరికింది.లండన్‌కు చెందిన ఒక వ్యక్తికి శాస్త్రవేత్తలు ఎయిడ్స్‌ను పూర్తిగా నయం చేశారు.

Advertisement

13 ఏళ్ల నుండి లండన్‌కు చెందిన వ్యక్తి ఎయిడ్స్‌ వ్యాదితో బాధపడుతున్నాడు.చికిత్స అయితే తీసుకుంటున్నాడు కాని శాస్వత మందు మాత్రం లభించలేదు.తాజాగా అతడు ఎయిడ్స్‌ నుండి పూర్తిగా విముక్తిని పొందాడు.

ఎయిడ్స్‌ వ్యాధితో బాధ పడుతున్న అదే వ్యక్తికి క్యాన్సర్‌ ఎటాక్‌ అయ్యింది.క్యాన్సర్‌ తీవ్రరూపం దాల్చడంతో ఎముక మజ్జ మార్పిడి చేయడం జరిగింది.

ఎముక మజ్జ మార్పిడి తర్వాత అతడి ఆరోగ్యం క్యూర్‌ అయ్యింది.

ఆ ఆపరేషన్‌ జరిగిన తర్వాత 18 నెలలకు ఎయిడ్స్‌ గురించిన పరీక్ష నిర్వహించగా అతడిలో ఎయిడ్స్‌ కణాలు లేకుండా పోయాయి.రెండు మూడు రకాల టెస్టులు చేసిన తర్వాత కూడా అతడిలో ఎయిడ్స్‌ లేదని వెళ్లడయ్యింది.ఎముక మజ్జ మార్పిడితో అతడిలో ఎయిడ్స్‌ లేకుండా పోయిందంటూ వైధ్యులు నిర్థారించారు.

పోలింగ్ ఏజెంట్ల నియామకంపై ఈసీ ఆదేశాలు
వైరల్ వీడియో : క్యాబ్ డ్రైవర్ తో హీరో గొడవ..

అయితే ఎముక మజ్జ మార్పిడి అనేది అత్యంత ఖరీదైన వ్యవహారం.అంత డబ్బును సామాన్యులు ఖర్చు చేయలేరు.

Advertisement

అంటే ఎయిడ్స్‌ మందుకు సంబంధించిన పరిశోదనలు ఇంకా జరగాల్సిన అవసరం ఉందన్నమాట.

తాజా వార్తలు