ఫైబర్ నెట్ కేసులో లోకేశ్ ఖచ్చితంగా దొరుకుతారు..: సజ్జల

ఏపీలో అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు, ఫైబర్ నెట్ కేసులు సీఐడీ కింద విచారణ జరుగుతున్నాయని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.

ఈ మేరకు స్కిల్ డెవలప్ మెంట్ కేసుతో పాటు గత రెండేళ్లుగా ఈ కేసులపై కూడా విచారణ జరుగుతోందని తెలిపారు.

ఆల్రెడీ రిమాండ్ లో ఉన్నారు కనుక రింగ్ రోడ్డు కేసులో విచారణ జరుపుతామని సీఐడీ కోర్టును కోరిందని పేర్కొన్నారు.అంతేకానీ ఇందులో కక్ష సాధింపు ఏమీ లేదని తేల్చి చెప్పారు.

రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబు అండ్ కో చాలా బెనిఫిట్ పొందారని ఆరోపించారు.కక్ష సాధించి అరెస్ట్ చేయడం వలన తమకేంటి ఉపయోగమని ప్రశ్నించారు.

అదేవిధంగా ఈ కేసుల్లో లోకేశ్ కూడా ఉన్నారన్న సజ్జల అన్ని చోట్లా ఆయన పేరు వస్తుందన్నారు.ఫైబర్ నెట్ లో లోకేశ్ కచ్చితంగా దొరుకుతారని చెప్పారు.

Advertisement

పీవీ రమేశ్ ఎందుకు ఉలిక్కిపడుతున్నారో అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు.

మనుషులను అంచనా వేయడంలోనూ వేణుస్వామి తోపు.. బిగ్‌బాస్ నెక్స్ట్ సీజన్ గెలిచేస్తారా..? 
Advertisement

తాజా వార్తలు