జగన్ పై సీరియస్ కామెంట్లు చేసిన లోకేష్..!!

ఇటీవల తిరుపతి రోడ్ షో లో చంద్రబాబు బహిరంగ సభ పై రాళ్ళు కొంతమంది వేసినట్లు టిడిపి నేతలు ఆరోపణలు చేస్తూ నిరసన చేపట్టిన సంగతి అందరికీ తెలిసిందే.

అయితే ఈ విషయంపై అధికార పార్టీకి చెందిన నాయకులు రాళ్లువిసిరే  రాజకీయం ఒక్క చంద్రబాబుకే తెలుసు అంటూ కౌంటర్లు వేస్తున్నారు.

ఇదిలా ఉంటే తాజాగా ఈ ఘటనపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఏపీ సీఎం జగన్ పై సీరియస్ కామెంట్లు చేశారు.జ‌గ‌న్‌ ది ప్రిజ‌న‌రీ బుద్ధి అని మండిపడ్డారు.

ఇదే తిరుప‌తి కొండ‌పైన స్మ‌గ్ల‌ర్లు, తీవ్ర‌వాదుల‌తో క‌లిసి 24 క్లైమోర్ మైన్లు పెట్టి పేల్చితే సాక్షాత్తు ఏడుకొండ‌ల‌వాడే కాపాడిన ప్రాణం చంద్ర‌బాబు గారిది.ఏ ఒక్క‌రూ బ‌తికే అవ‌కాశంలేని దాడి నుంచి తేరుకుని స‌హ‌చ‌రులు ఎలా ఉన్నారని వాక‌బు చేసిన‌ గుండె ధైర్యం చంద్ర‌బాబు గారిది.

నీలాంటి ఫ్యాక్ష‌న్ కుక్క‌మూతిపిందెలు వేసే రాళ్లు ఆయ‌నని భ‌య‌పెట్టలేవు.జ‌గ‌న్‌ నీ ప్రిజ‌న‌రీ బుద్ధితో రాళ్లేయిస్తే,అదే రాళ్ల‌తో జ‌నానికి ప‌నికొచ్చే ఒక‌ నిర్మాణం చేయించ‌గ‌ల విజ‌న‌రీ  చంద్ర‌బాబు గారు.

Advertisement

తిరుప‌తిలో నా స‌వాల్ కి తోక‌ముడిచి తొలి ఓట‌మి అంగీకరించావ్.చంద్రబాబు గారి స‌భ‌ల‌కు వ‌స్తున్న జ‌నాన్ని ఓర్వ‌లేక నీ రౌడీమూక‌ల‌తో రాళ్ల దాడి చేసి రెండో ఓట‌మిని ఒప్పుకున్నావు” అంటూ జగన్ ని ఉద్దేశించి సోషల్ మీడియాలో లోకేష్ సీరియస్ వ్యాఖ్యలు చేశారు.

రాజధానిపై నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు..!!
Advertisement

తాజా వార్తలు